టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా సినిమా అలవైకుంఠపురములో ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. గత రెండేళ్లుగా సరైన సక్సెస్ లేని బన్నీకి ఈ సినిమా మంచి విజయాన్నే అందించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మంచి ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాని నిర్మించాయి. ఇకపోతే గతంలో బోయపాటి శ్రీనుతో కలిసి బన్నీ నటించిన సరైనోడు సినిమా మంచి సక్సెస్ ని అందుకుంది. మంచి మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు బోయపాటి ఆ సినిమాని తెరకెక్కించారు. 

 

ఇక మొన్నటి జనవరి 17న బోయపాటి శ్రీను తల్లి శ్రీమతి సీతారావమ్మ గారు అనారోగ్య కారణంగా గుంటూరు జిల్లా పెదకాకానిలో మరణించారు. అయితే తల్లి మరణవార్త తెలియగానే హైదరాబాద్ నుండి హుటాహుటిన ఫ్యామిలీతో కలిసి గుంటూరు బయల్దేరిన బోయపాటి, ఒకింత కన్నీటిపర్యంతం అయినట్లు సమాచారం. ఇక ఆమె మరణానికి పలువురు సినిమా ప్రముఖులు నివాళులు తెలిపారు. ఇకపోతే నేడు బోయపాటిని కలిసి ఆయనకు మానసికంగా ధైర్యం చెప్పేందుకు హీరో బన్నీ గుంటూరు జిల్లా పెదకాకానిలోని బోయపాటి స్వగృహానికి వెళ్లడం జరిగింది. బన్నీ రాకతో ఆ ప్రాంతం అంతా జనసందోహంతో నిండిపోయింది. 

 

అయితే ఆయన రాక గురించి కావాలని రహస్యంగా ఉంచినట్లు సమాచారం. తనకు మంచి హిట్ ని అందించి, ఎప్పటికప్పుడు తనను సోదరుడి వలే ప్రోత్సహించే బోయపాటి గారి మాతృమూర్తి చనిపోవడం నిజంగా ఎంతో బాధగా ఉందని బన్నీ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా బోయపాటి, బన్నీ మధ్య కొంతసేపు మాటలు సాగాయని, అతి త్వరలో హైదరాబాద్ రాగానే మళ్ళి కలుద్దాం అని బోయపాటికి ధైర్యం చెప్పి బన్నీ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం కాసేపటి క్రితం బయటకు రావడంతో పలువురు ప్రజలు బన్నీ పెద్ద మనసుపై గొప్పగా కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: