సునీల్ కమెడియన్ గా  ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి  ఎన్నో ఏళ్ల పాటు తనదైన స్టైల్ లో టాప్ కమెడియన్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మర్యాద రామన్న సినిమాలో హీరోగా అవకాశం రావడంతో కమెడియన్ నుంచి హీరోగా మారిపోయాడు సునీల్. అయితే హీరోగా ఒక మర్యాద రామన్న మినహా ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ప్రేక్షకుల ఆదరణ మాత్రం పొందలేకపోయారు. ఈ క్రమంలోనే సునీల్ కి సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి . దీంతో మరోసారి కమీడియన్  గా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ కమిడియన్ గా  మరోసారి తన కామెడీ ని స్టార్ట్ చేశారు. ఇకపోతే తాజాగా కమెడియన్ సునీల్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. 

 

 

 సునీల్ తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్ పాలయ్యాడు అని ..  కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచారం చేశాయి. దీంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ మొత్తం షాక్ కి గురైన విషయం తెలిసందే . సునీల్  ఫాన్స్ అందరు నిజంగానే సునీల్ కు అస్వస్థత అని కంగారు పడ్డారు కూడా. మెల్లిమెల్లిగా సునీల్ ఆరోగ్యానికి సంబంధించి అన్ని నిజాలు బయటకు వస్తున్నాయి. సునీల్ గత కొన్ని రోజులుగా లివర్ కు సంబంధించిన అతి చిన్న సమస్యతో బాధపడుతున్నారని దానికితోడు వైరస్  కూడా రావడంతో జ్వరం వచ్చేసిందట. వైద్యుల సూచన మేరకు సునీల్ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు  తెలుస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం ఎవరికి తోచినట్లు వాళ్ళు రాసేశారు . దీంతో ఫ్యాన్స్ లో గందరగోళం కూడా నెలకొంది. 

 

 

 ఇది గమనించిన సునీల్  ఆన్లైన్ లోకి వచ్చి తనకు ఏం కాలేదు ఒకసారి క్లారిటీ ఇచ్చాడు  కూడా. అయినప్పటికీ తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలు ఆకట్టుకోవడంతో.. ఆరోగ్యానికి సంబంధించి మరో పోస్టు కూడా పెట్టాడు. నా గురించి ఇంతగా ఆలోచించినా నా  శ్రేయోభిలాషులు అందరికీ ధన్యవాదాలు... ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది... అంటూ కమెడియన్ సునీల్ తన ఫేస్ బుక్ పేజీలో ఒక పోస్టు పెట్టాడు. దాంతో పాటు తాను నటించిన డిస్కో రాజా మూవీ రేపు థియేటర్ లోకి వస్తుందని ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేయండి అంటూ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో రవితేజ తో పాటు సునీల్ కూడా నటించాడు. మొత్తానికి సునీల్  ఆరోగ్యం గురించి క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: