మెగా ఫ్యామిలీ నుండి మరో వారసుడు ఇండస్ట్రీకి పరిచయం కాబొతున్నాడన్న విషయం తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పరిచయం కాబోతున్నాడు. వైష్ణవ్ తేజ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సుకుమార్ కూడా నిర్మాణ భాగస్వామ్యంలో పాలు పంచుకుని నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఉప్పెన.. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.

 

ఈ పొస్టర్ లో వైష్ణవ్ తేజ్ అలలకి అటు వైపుగా నిల్చుని ప్రపంచాన్ని గెల్చినట్టుగా చూస్తున్నాడు. అయితే అటు వైపుగా నిల్చున్న వైష్ణవ్ తేజ్ మొహం పూర్తిగా కనిపించట్లేదు. అయితే అలా చేయడమ్ వెనక ఓ పెద్ద కారణం ఉందని అనుకుంటున్నారు. గతంలో రామ్ చరణ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో రామ్ లుక్ ఎలా ఉంటుందనేది రివీల్ చేయలేదు. సినిమా చూస్తే తప్ప అతని లుక్  ఎలా ఉందో తెలియకుండా చేశారు.

 

అయితే ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. సినిమా ద్వారానే వైష్ణవ్ తేజ్ లుక్ బయట పెట్టేలా ఉన్నారేమో అని భావిస్తున్నారు.  వైష్ణవ్‌ తేజ్‌ బయట ఎలా వుంటాడనేది తెలిసినా కానీ ఈ సినిమాలో అతను ఎలా కనిపిస్తాడనేది తెలియనివ్వడం లేదు. అతని ఉప్పెన చిత్రం ఏప్రిల్‌ 2న విడుదలకి సిద్ధమవుతోంది. ఇందులో తమిళ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా కనిపించనుండడం విశేషం.

 

 

ఐతే ఇక్కడే చిన్న సందేహం. కేవలం పోస్టర్ లుక్ కోసమే అలా ఉంచారా లేదా స్ట్రాటజీ ప్రకారమే అలా చేశారా అన్నది తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు సినిమా ప్రమోషన్లలో టీజర్, ట్రైలర్ ల ప్రాముఖ్యత ఎంత ఉందో అందరికీ తెలిసిందే. మరి టీజర్ కట్ చేయాలంటే ఖచ్చితమంగా వైష్ణవ్ లుక్ బయటకి రావాల్సిందే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: