చాలా కాలం తర్వాత దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇవ్వడం తో పవన్ కళ్యాణ్ అభిమానులకు మంచి జోష్ మీద ఉన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన పింక్ ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తూ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం అందరికీ తెలుసు. అయితే ఈ సినిమాకి సంబంధించి మొట్ట మొదటి రోజు షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ నడుస్తూ వెళ్ళిన ఒక పిక్ సోషల్ మీడియాలో రావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇలా ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ఏదో రోజు వార్తల్లో నిలుస్తూనే వస్తున్నాడు. ముఖ్యంగా పింకు సినిమా పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకోవడం పట్ల చాలా మందికి ఇష్టం లేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం అది తన అభిమానులకు నచ్చే విధంగా తీయాలని డైరెక్టర్ వేణు శ్రీరామ్ కి గట్టిగా చెప్పటంతో స్క్రిప్టులో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఫిబ్రవరి నెల నుండి సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న క్రమంలో రాజకీయాలకు ఏ మాత్రం దూరం కాకూడదని మరోపక్క అనుకున్న టయానికి షూటింగ్ కి అందుబాటులో ఉండాలని అనుకున్న సమయంలోనే సినిమాని పూర్తి చేయాలని డిసైడ్ కావడంతో సినిమా యూనిట్ పవన్ కి అనుకువుగా ఉండే విధంగా ఒకటే స్టూడియోలో సెట్స్ వేసి సినిమాని పూర్తి చేయాలనీ పక్కాగా ప్లాన్ చేసుకున్నారు.

 

అంతేకాకుండా ఒక పొలిటీషియన్ గా కూడా ఉండటంతో పవన్ కళ్యాణ్ ట్రావెలింగ్ కి సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒక స్పెషల్ ఫ్లైట్ పవన్ కళ్యాణ్ కి కేటాయించినట్లు ప్రతిరోజు హైదరాబద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి ట్రావెల్ చేయాలంటే చాలా సమయం వృధా అవుతోంది. అందుకే పవన్ కి అనుకూలంగా ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని చార్టెడ్ ఫ్లైట్ ని రెడీ చేసినట్లు సమాచారం. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: