టాలీవుడ్ లోకి తేజ దర్శకత్వంలో  కళ్యాన్ రామ్ హీరోగా నటించిన ‘లక్ష్మీ కళ్యాణం’ మూవీతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది కాజల్.  మొదటి సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘మగధీర’ మూవీతో బాక్సాఫీస్ హిట్ అందుకుంది.  అంతే ఒక్కసారే ఈ అమ్మడి జాతం మొత్తం మారిపోయింది.  టాలీవుడ్ ప్రస్తుతం కాజల్ అగర్వాల్ .. కమల్ హాసన్ హీరోగా నటిస్తోన్న ‘భారతీయుడు 2’లో నటిస్తుంది.  ఈ మూవీలో మొదటి సారిగా ఓ ప్రయోగాత్మక పాత్రలో  85 ఏళ్ల ముసలమ్మ పాత్రలో నటిస్తోంది. వాటితో పాటు బాలీవుడ్‌లో ‘ముంబాయి సాగా’ సినిమా చేస్తోంది.  

 

అయితే ఈ మూవీస్ అన్ని ఎపుడో రెండేళ్ల క్రితం కాజల్ ఒప్పుకున్నవి. ఈ మధ్యలో ఈ భామ ఏ సినిమాకు సైన్ చేయలేదు. ముఖ్యంగా తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు.  గత ఏడాది తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీను నటించిన ‘సీత’ మూవీలో, కవచం మూవీలో నటించింది. ఈ రెండు సక్సెస్ కాలేదు..అందుకే సినిమాలు తగ్గుముఖం పట్టడంతో వెబ్‌ సీరీస్‌పై దృష్టి సారించింది. ఇప్పటికే నవతరం హీరోలతో నటించడానికి కూడా ఓకే చెప్పేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడతూ.. తాను సినిమాకు పరిచయమైన కొత్తలో పరిస్థితి వేరు. ఇపుడున్న పరిస్థితులు వేరని చెప్పుకొచ్చింది.

 

ప్రస్తుతం తాను నటిగా చాలా పరిణితి చెందానని చెప్పుకొచ్చింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రిస్క్‌ తీసుకోవడానికి భయపడనని చెప్పింది.స్తుతం తనకు తగ్గుతున్న అవకాశాల గురించి మాట్లాడుతూ ప్రస్తుతం తనకు రెస్ట్ లేకపోవడం వల్లనే సినిమాలు ఒప్పుకోవడం లేదని.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాక మళ్లీ సినిమాలు చేస్తానని కవరింగ్ ఇస్తుంది. మరి ఈ అందాల భామకు ‘ఇండియన్ 2 ’ మూవీ ఎంత వరకు కలిసి వస్తుందో లేదో చూడాలి.  ఒకవేళ హిట్ అయితే మాత్రం మరికొంత కాలం కెరీర్ నిలుపుకొనే అవకాశం ఉందంటున్నారు సినీ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: