అందాల నటి స్నేహ మరోసారి రెండోసారి తల్లయ్యారు. తాజాగా పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త హీరో ప్రసన్న వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ పెట్టారు. ఒరు నీల పక్షి(2000) అనే సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం అయింది.  తెలుగు, తమిళ, మలయాళ మూవీస్ లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగులో హీరో గోపిచంద్ నటించిన మొదటి సినిమా తొలివలపు లో నటించింది. తర్వాత ప్రియమైన నీకు, సంక్రాంతి, వెంకి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.  తన సహనటుడు ప్రసన్నను వివాహం చేసకొని కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంటు వచ్చింది.  

 

తమిళ మూవీ అచ్చముండు అచ్చముండుతో కలిసి నటించిన ఈ ఇద్దరు ఆ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. 2012 వీరిద్దరి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇప్పటికే విహాన్‌ అనే బాబు ఉన్నాడు. విహాన్ పుట్టిన తరువాత స్నేహ సినిమాలకు దూరంగా ఉన్నారు.  అయితే తమ ఇంటికి శుక్రవారం మహాలక్ష్మి వచ్చిందని.. సంతోషపడుతున్నారు ఈ జంట. కొంత కాలం సినిమాలు దూరంగా ఉన్నా అప్పుడుప్పుడు ఏవో అడపా దడపా సినిమాలు మాత్రమే చేస్తున్నారు స్నేహ.  ఇటీవల సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన స్నేహ.. ధనుష్‌ హీరోగా తెరకెక్కిన తమిళ మూవీ పటాస్‌లో నటించారు.

 

ప్రస్తుతం ఆమె సహనటులు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభి మంచి ఛాన్సులు కొట్టేస్తున్నారు. మరికొంత మంది బుల్లితెరపై రాణిస్తున్నారు. మీ ఇంటికి బుల్లి ఏంజిల్ వచ్చిందని అంటున్నారు సహనటులు.  ఎలాగూ ఇద్దరు బిడ్డల తల్లి కావడంతో ఆ చిన్నారుల ఆలనా పాలనా చూస్తుందా లేక సినిమాలపై ఎక్కువగా దృష్టి పెడుతుందా చూడాలి. అయితే ఈ మద్య హీరోయిన్లు పిల్లలు ఉన్నా.. తమకు ఏ ఛాన్స్ వచ్చినా సద్వినియోగం చేసుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో నటి స్నేహ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: