తమిళ, తెలుగు లో  ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరును సంపాదించుకోవడమే కాకుండా.. మంచి మార్కెట్ ను దానితో పాటుగా ఫ్యాన్స్ ను బాగానే పోగేసుకున్నారు. ఎన్ని సినిమాలలో విభిన్న పాత్రల్లో నటిస్తూ ఇప్పటికి వరుస సినిమాలలో నటిస్తూ మంచి కలెక్షన్స్ ను రాబడుతూ ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. 

 


ఇకపోతే వీరిద్దరూ రాజకీయాల్లో రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలాంటివారైన సూపర్‌స్టార్ రజినీకాంత్, విశ్వ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోంది. అయితే, రాజకీయాల పరంగా వీరిద్దరి మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా.. సినిమా రంగంలో మాత్రం ఇద్దరికీ ఒకేమాట. ఇక వీరి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా గురించి చెప్పాలంటే.. ఇటీవల ‘దర్బార్’ సినిమాతో తమిళ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టిన తలైవా ప్రస్తుతం తన 168వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

 


రజిని కాంత్ సినిమాలంటే ఫటా ఫట్ అన్న విషయం తెలిసిందే.. ఒక సినిమా చిత్రీకరణలో ఉండగానే మరొక సినిమాలో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా రంజినీ అదే చేసాడు. రాజ్‌కమల్ ఫిలింస్ బ్యానర్‌పై కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలీయాలంటే రజినీ, కమల్ స్పందించాలి. ఒకవేళ ఇది నిజమైతే.. తమిళనాడు ప్రజలకు నిజంగా ఈ సినిమాపండుగ అవుతుంది. 

 

ఇకపోతే దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఇద్దరు లెజెండ్స్ కలిసి పనిచేయబోయే సినిమా ఇదే అవుతుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది.ఆరు పదుల వయసులోనూ రజినీ కుర్ర హీరోలా గ్యాప్ లేకుండా సినిమాలు చేసేస్తూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నారు. అయితే సినిమాలు చేయలేని సమయంలో రాజకీయాల వైపు రజినీ మొగ్గు చూపనున్నారని సమాచారం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: