బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ అంటే తెలియని వారుండరు. ఇక తెలుగులో వెంకటేష్ సరసన మల్లీశ్వరీ చిత్రంలో నటించిన ఈ బ్రిటీష్ భామ రహస్య వివాహాన్ని చేసుకుందట. అది కూడా అగ్రనటుల సమక్షంలో ఇక ఈ వివాహానికి, అమితాబ్ దంపతులతో పాటుగా, ముఖ్య అతిథులుగా నాగార్జున, ప్రభు, శివరాజ్కుమార్ లు కూడా హజరై ఆశీర్వదించారట. ఇక ఈ వివాహంతో కత్రినా వైఫ్గా ప్రమోషన్ కూడా పొందారు.
ఇకపోతే కత్రినా వివాహం అంగరంగ వైభవంగా, ఎలాంటి ఆడంబరాలు, ప్రచారం లేకుండా అత్యంత రహస్యంగా జరిగింది.. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు ఫీలవుతున్నారేమో. అయ్యో మీరేం ఫీలవకండి. ఇదేమి నిజమైన పెళ్లి కాదు. ఇదంతా ఓ యాడ్కు సంబంధించిన షూటింగ్. ఈ యాడ్లో కత్రినా తల్లిదండ్రులుగా అమితాబ్ దంపతులు నటించగా, ముఖ్య అతిధులుగా ముఖ్య అతిథులుగా నాగార్జున, ప్రభు, శివరాజ్కుమార్ నటించారు... ఇకపోతే ఓ నగల దుకాణానికి బ్రాండ్ అంబాసిడర్గా కత్రినా కైప్ వ్యవహరిస్తుండగా, తెలుగులో నాగార్జున, తమిళంలో ప్రభు, కన్నడలో శివరాజ్కుమార్ ప్రచారకర్తలుగా చేస్తున్నారు..
వీరితో పాటు బాలీవుడ్ బిగ్బీ అమితాబ్, ఆయన భార్య జయాబచ్చన్ కూడా పాల్గొంటున్నారు. ఇక సృజనాత్మకంగా చిత్రిస్తున్న ఈ యాడ్లో భాగంగా కత్రినా కైఫ్ పెళ్లి కూతురు అవతారం ఎత్తగా మిగతా పాత్రల్లో ఈ ప్రముఖ నటులు నటించిన ఈ యాడ్కు సంబంధించి ఫొటోలను అమితాబ్ సోషల్ మీడియాలో విడుదల చేశారు.
కాగా ఈ సందర్భంగా అమితాబచ్చన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. అదేమంటే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ముగ్గురు అగ్ర నటుల కుమారులైన ప్రముఖ నటులు.... వారిలో తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున, తమిళ్లో శివాజీగణేషన్ కుమారుడు ప్రభు, కన్నడ పరిశ్రమలో రాజ్కుమార్ కుమారుడు శివరాజ్కుమార్తో నటించడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలియచేసారు..