చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల తరువాత తరంలో వచ్చిన హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇద్దరూ కూడా ఎవరికి వారు ప్రత్యేకంగా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్, స్టామినా క్రియేట్ చేసుకున్నారు. నిజానికి ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ నెంబర్ హీరో ఎవరు అనే చర్చ జరిగిన ప్రతీసారి ఈ ఇద్దరు హీరోలు కూడా అందరికంటే ముందు వరుసలో నిలుస్తారనే విషయం మెజారిటీ ప్రేక్షకులకు కూడా తెలుసు. ఇక వీరి సినిమాలకు యావరేజ్ అనే టాక్ వస్తే చాలు, అది సూపర్ హిట్ సినిమా రేంజ్ కలెక్షన్స్ ని అందుకున్న పరిస్థితులు వీరి గత సినిమాలు కొన్ని ప్రూవ్ చేసాయి. అయితే ఇటీవల రాజకీయాల్లో బిజీ అయి, మళ్ళి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం పింక్ మూవీ రీమేక్ లో నటిస్తున్నారు. 

 

మరోవైపు ఇటీవల సరిలేరు నీకెవ్వరు తో కెరీర్ పరంగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు అతి త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, వీరిద్దరూ కూడా తమ తదుపరి సినిమాలను పాన్ ఇండియా ఫీల్ తో తెరకెక్కించి పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేసి తమ మార్కెట్ పరిధిని పెంచే విధంగా ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. పింక్ రీమేక్ తరువాత పవన్, క్రిష్ దర్శకత్వంలో చేయబోయే పీరియాడికల్ మూవీని తెలుగుతో పాటు హిందీ, సహా పలు ఇతర సౌత్ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని ఆ సినిమా నిర్మాత ఏ ఎమ్ రత్నం, దర్శకుడు క్రిష్ ఇద్దరూ కూడా గట్టిగా ఆలోచనలు చేస్తున్నారట. 

 

ఇక మరోవైపు మహేష్, వంశీ ల కలయికలో తెరకెక్కబోయే సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన సోనీ పిక్చర్స్ వారు ముందుకు వచ్చారని, మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కనున్న ఈ సినిమాని మహేష్ బాబు, పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. అయితే ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మాత్రం, ఈ ఇద్దరు స్టార్ హీరోల మార్కెట్, క్రేజ్ మరింతగా పెరిగడం ఖాయం అనే చెప్పాలి...!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: