టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మూడేళ్ళ క్రితం వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా తో టాలీవుడ్ కి హీరోగా రిఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. మధ్యలో సినిమాలకు గ్యాప్ వచ్చినా, తన బాక్సాఫీస్ స్టామినా మాత్రం తగ్గలేదని ఆయన మరొక్కసారి ఆ సినిమా అద్భుత విజయంతో రుజువు చేసారు. అయితే ఆ తరువాత మెగాస్టార్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించిన సైరా నరసింహారెడ్డి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆశించిన రేంజ్ లో విజయాన్ని అందుకోలేకపోయింది. దానితో కొంత ఆలోచనలో పడ్డ మెగాస్టార్, తదుపరి చేయబోయే సినిమాను తప్పకుండా సక్సెస్ చేయాలని భావించి, యువ దర్శకుడు కొరటాల శివకు తన తదుపరి సినిమా అవకాశం కల్పించారు. 

 

ఇక ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. జూన్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాక్. తన గత సినిమాల మాదిరిగా కొరటాల ఈ సినిమాలో కూడా మంచి మెసేజ్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ని మిక్స్ చేసి దీనిని తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇకపోతే ఈ సినిమా తరువాత మెగాస్టార్ ఇకపై సినిమాల్లో నటించే అవకాశం లేదనే వార్త నేడు పలు టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి ఈ సినిమా తరువాత మెగాస్టార్, త్రివిక్రమ్ తో ఒక సినిమా, అలానే బోయపాటి శ్రీనుతో మరొక సినిమా చేయాల్సి ఉందని సమాచారం. 

 

కానీ ఆయన మాత్రం వారి నుండి కథలు వినేందుకు సుముఖంగా లేరని అంటున్నారు. కారణాలు ఏంటనేది తెలియరాలేదు కానీ, ఆయన మాత్రం కొరటాల సినిమా తరువాత పూర్తిగా విరామం తీసుకోనున్నట్లు ప్రచారం అవుతున్న ఈ వార్త యొక్క సారాంశం. అయితే దీనిపై ఇప్పటివరకు మెగాస్టార్ నుండి కానీ, ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ నుండి కానీ ఎటువంటి స్పందన రాలేదు. కాగా ఈ వార్త పై ఆయన కుటుంబం స్పందిస్తేనే కానీ అసలు వాస్తవాలు వెల్లడి కావని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఒకవేళ ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, ఇది నిజంగా మెగా ఫ్యాన్స్ కు భారీ చేదు వార్తే అని చెప్పకతప్పదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: