అక్కినేని ఫ్యామిలీ ప్రేమజంట నాగ చైతన్య, సమంతలు ఒక సినిమా విషయంలో చెరో మాట చెబుతున్న విషయం ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. లాస్ట్ ఇయర్ మజిలీ, ఓ బేబీ సక్సెస్ లతో సమంత.. మజిలీ, వెంకీమామ సక్సెస్ లతో చైతు కెరియర్ మంచి జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం చైతన్య శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. సమంత 96 తెలుగు రీమేక్ జాను సినిమాలో నటిస్తుంది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను మాత్రుక దర్శకుడు ప్రేం కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు.

 

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ ప్లాన్ చేశారు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమాలోని మొదటి సాంగ్ ప్రేక్షకులను అలరించింది. చైతు లవ్ స్టోరీ, సమంత జాను సినిమాల తర్వాత ఇద్దరు కలిసి మరో ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. ఆరెక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి మహా సముద్రం అని ఒక సినిమా కథ పట్టుకుని తిరుగుతున్నాడు. రాం, నితిన్, రవితేజ చివరకు నాగ చైతన్య దగ్గరకు ఆ కథ వచ్చింది. చైతు దాదాపు సినిమా ఓకే చేసి సమంతను హీరోయిన్ గా అనుకోగా చివరి నిమిషంలో ఆ సినిమాను కాదన్నాడట.

 

చైతన్య కూడా హ్యాండ్ ఇవ్వడంతో అదే కథను శర్వానంద్ తో తీయాలని ఫిక్స్ అయ్యాడు అజయ్ భూపతి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చైతు హీరోగా అనుకున్నప్పుడు సమంతని హీరోయిన్ గా అనుకోగా ఇప్పుడు శర్వానంద్ హీరోగా చేస్తున్నాడు కాబట్టి సమంత చేయదని అనుకున్నారు. కాని చైతు వద్దని చెప్పినా సినిమా కథ నచ్చడంతో మహా సముద్రం సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: