సంక్రాంతి రేసుకు వచ్చిన ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలు కలక్షన్స్ విషయంలో నడిపించిన ప్రచార వ్యూహాల పై రామ్ చరణ్ అభిమానులు కొంతవరకు అసహనానికి లోనవ్వడంతో చరణ్ అభిమానులు బన్నీ మహేష్ లను టార్గెట్ చేస్తూ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ‘అల’ ‘సరిలేరు’ మూవీలు తమ సినిమాలకు సంబంధించి ‘రంగస్థలం’ రికార్డులను బ్రేక్ చేసాయి అంటూ ఇప్పుడు ఒక కొత్త ప్రచారం మొదలు పెట్టారు. 

ముఖ్యంగా ‘అల’ మూవీ యూనిట్ వర్గాలు అయితే బన్నీ సినిమా ఇప్పటికే ‘రంగస్థలం’ నెట్ కలక్షన్స్ ఫిగర్స్ ను దాటేసి ఇండస్ట్రీ టాప్ 5 హిట్స్ జాబితాలో ‘బాహుబలి 2’ ‘సైరా’ లతో సమానంగా ఒక కొత్త చరిత్రను క్రియేట్ చేసింది అంటూ సరికొత్త ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ ప్రచారం చరణ్ అభిమానుల దృష్టి వరకు వెళ్ళడంతో వారు కొన్ని లోతైన ప్రశ్నలు అడుగుతూ బన్నీ మహేష్ లను ఇరుకున పెడుతున్నారు. 

‘రంగస్థలం’ తన టోటల్ రన్ లో 123 కోట్లు వసూలు చేసిన విషయం వాస్తవమే అయినా ఆ రేంజ్ కలక్షన్స్ అప్పట్లో సింగిల్ స్క్రీన్ లో టిక్కెట్ 100 రూపాయలు ఉన్నప్పుడు వచ్చాయని చరణ్ అభిమానుల వాదన. అయితే సంక్రాంతి రేస్ కు వచ్చిన ‘అల’ ‘సరిలేరు’ సినిమాల సింగిల్ స్క్రీన్ టిక్కెట్లను 200 రూపాయలకు పెంచి అమ్మడం వల్ల వచ్చిన కలక్షన్స్ ను ‘రంగస్థలం’ లా టిక్కెట్ రేటు పెంపు లేకుండా వచ్చిన కలక్షన్స్ తో ఎలా పోలుస్తారు అంటూ సూటిగా చరణ్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

అంతేకాదు ‘సరిలేరు ‘అల’ సినిమాలలో మహేష్ అల్లు అర్జున్ లు పోషించిన పాత్రలు’రంగస్థలం’ లోని చరణ్ చిట్టిబాబు పాత్రకు సరిపోతాయా అంటూ ప్రశ్నించడమే కాకుండా ఒక టాప్ హీరో స్థాయిలో చెవిటి వాడిగా నటించే సాహసం మహేష్ బన్నీలు చేయగలరా అంటూ వారిద్దరిని చరణ్ అభిమానులు కార్నర్ చేస్తున్నారు. ‘రంగస్థలం’ లోని చిట్టిబాబు పాత్రకు చరణ్ కు జాతీయ స్థాయి అవార్డ్ ఒక్క ఓటు తో మిస్ అయిన విషయాన్ని గుర్తుకు చేస్తూ అలాంటి గుర్తింపు అల్లు అర్జున్ మహేష్ లకు వస్తుందా అంటూ చెర్రీ అభిమానులు వారిద్దరిన్నీ టార్గెట్ చేస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: