ఒకే ఒక్క చిత్రం ఆ దర్శకుని జీవితాన్ని మార్చేసింది. అతను తీసిన మొదటి సినిమా హిట్. ఆ తర్వాత అతనితో సినిమాలు తీయడానికి వరుసగా పెద్ద హీరోలు సైతం క్యూ కడుతున్నారు. ఆ దర్శకుడి పేరే లోకేష్ కానగరాజన్.. ఈ దర్శకుడు ఇటీవల కార్తీ హీరో తో ‘ఖైదీ’ చిత్రం చేశాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా, 100 కోట్లకు పైగా వసూలు రాబట్టి సంచలనం విజయం సాధించింది.

 

 

సినిమా విజయం తర్వాత ఈ దర్శకుడికి వచ్చే అవకాశాలు మాత్రం తక్కువ లేవు. ఒక దశలో రామ్ చరణ్ తో ఓ సినిమా చేయనున్నాడనే వార్త కూడా సినీ వర్గాల్లో గుప్పుమన్నది. అంతే కాకుండా ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ ఏక కాలంలో తెరకెక్కించే ఆలోచనల్లో ఉన్నట్లు వార్త వ్యాపించింది. అయితే ప్రస్తుతం ఇళయ దళపతి విజయ్ తో సినిమా చేయబోతున్నాడని మరోటాక్ కూడా. ఇదిలా ఉండగా ఇప్పుడు తెలిసిన తాజా విషయం ఏంటంటే ఈ దర్శకుడికి సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కిందట..

 

 

ఇకపోతే గత కొంత కాలంగా ఫ్లాపులతో సతమతం అవుతున్న రజనీ కాంత్‌కు దర్బార్ చిత్రంతో కాస్త ఊరట దక్కింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని తన స్థానాన్ని పదిలం చేసుకున్న రజనీకాంత్ ప్రస్తుతం విశ్వాసం ఫేమ్ శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత రజని, లోకేష్ తో సినిమా చేస్తాడట.

 

 

ఈ చిత్రం పూర్తైయ్యే లోపు విజయ్ హీరోగా చేస్తున్న మాస్టర్ చిత్రాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇకపోతే ఇప్పటికే మాస్టర్ ఫస్ట్ లుక్ తో అందరికి ఆకట్టుకున్న ఈ దర్శకుడు తన తర్వాతి సినిమాలో సూపర్ స్టార్ ని ఎలా చూపిస్తాడో అనే ఆసక్తి పెరిగింది. ఇక రజనీ అభిమానులైతే తమ సూపర్ స్టార్ హీరో సినిమాకు సంబంధించిన న్యూ అప్డేట్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారట. సో త్వరలోనే రజనీ కి సంబందించిన న్యూస్ అధికారికంగా విడుదల కానుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: