బాహుబలి సినిమా తర్వాత అనుష్క రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం ఆమెకి హీరోలతో సమానంగా క్రేజ్ ఏర్పడింది. అందుకే ఎక్కువగా లేడీ ఓరియంటెడి పాత్రల్లోనే కనిపిస్తుంది. బాహుబలి లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత ఆమె నటించిన భాగమతి మంచి విజయం సాధించింది. దాంతో తన తర్వాతి చిత్రంగా మరో లేడీ ఓరియంటెడ్ మూవీని లైన్లో పెట్టింది. నిశ్శబ్దం అంటూ మన ముందుకు వస్తున్న అనుష్క తన సినిమా రిలీజ్ ఎప్పుడనేది ఇప్పటి వరకు ప్రకటించలేదు.

 

 

కోన ఫిల్మ్ కార్పోరేషన్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి ౩౧ వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ విడుదల తేదీ దగ్గర పడుతున్నా కూడా ఎలాంటి హంగామా లేకపోవడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడిందనే చెప్పవచ్చు. అయితే మరో కొత్త తేదీని ప్రకటించక పోయినప్పటికీ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది చెప్పేశారు. ఫిబ్రవరి మూడవ వారంలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారట.

 

 

ఒకవేల అదే నిజమైతే సినిమా చాలా వరకు నష్టపోయే ప్రమాదం ఉంది. జనవరి 31 వ తేదీ తర్వాత ఫిబ్రవరి లో సినిమా రిలీజ్ చేయడం అనేది సరైన సీజన్ కాదని అంటున్నారు. ఫిబ్రవరి నెలలో సినిమాలేవీ ఎక్కువగా ఆడవని టాక్. అప్పటికీ జనాలు పిల్లలకి ఎగ్జామ్స్ అనే బిజీలో ఉంటారు కాబట్టి ఫ్యామిలీస్ థియేటర్లకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి అలాంటి అన్ సీజన్లో అనుష్క " నిశ్శబ్దం" సినిమాని రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని భావిస్తున్నారు.

 

 

మ‌రి ఈ ప్ర‌తికూల‌త‌ను అధిగ‌మించి అనుష్క త‌న బాక్సాఫీస్ స్టామినా చూపిస్తుందేమో చూడాలి. ఈ సినిమాలో అనుష్కతో పాటు ఆర్ మాధవన్, షాలినీ పాండే, అంజలి కూడా నటిస్తున్నారు. హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: