ఈ మద్య సినీ సెలబ్రెటీలు ప్రతి చిన్నవిషయాలకు మనసు వికలం కావడం...చివరికి ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది.  ఇటీవల కాలంలో బుల్లితెర నటులు చాలా మంది ఈ కారణల వల్లనే ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ టీవీ నటి సెజల్ శర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. 'దిల్ తో హ్యాపీ హై జీ'లో సిమ్మీ ఖోస్లాగా గుర్తింపు పొందిన శర్మ.. శుక్రవారం తన గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. సెజల్ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఇంట్లో ఆమె స్నేహితులు ఇద్దరు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె గదిలో ఒక సూసైడ్ నోట్ కూడా లభించినట్లు పోలీసులు తెలిపారు. సెజల్ శర్మ సహ నటుడు అరు కే వర్మ మాట్లాడుతూ.. సెజల్ ఆత్మహత్య వార్త విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. 

 

పది రోజుల క్రితమే తాను ఆమెను కలిశానని, గత ఆదివారం వాట్సాప్ చాట్ చేసినట్లు చెప్పారు. పది రోజుల క్రితం ఆమెను కలిసినప్పుడు ఆమె అప్పుడు బాగానే ఉందని తెలిపారు. సెజల్ కుటుంబానికి ఈ రోజు ఉదయం ఆమె మరణ వార్త తెలిసింది. కానీ, సెజల్ నిన్న రాత్రే ఆత్మహత్య చేసుకున్నట్లు నేను భావిస్తున్నాను. సెజల్ అంత్యక్రియల కోసం మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు ఉదయపూర్‌కు తీసుకువెళ్లారు’ అని ‘దిల్ తో హ్యాపీ హై జీ’షోలో సెజల్‌తో పాటు నటించిన అరుల్ వర్మ తెలిపారు. తాను ఆత్మహత్య చేసుకుందని అంటుంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా అని వాపోయారు. 

 

 గతంలో ఎన్నో టీవీ ప్రకటనల్లో, వెబ్ సిరీస్‌లలో సెజల్ నటించారు. నెల రోజుల క్రితమే కుషాల్ పంజాబీ అనే బుల్లి తెర నటుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన సరిగ్గా నెల రోజులకు మరో నటి చనిపోవడంతో హిందీ బుల్లి తెర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఉదయపూర్ నుండి 2017లో ముంబై వచ్చిన సెజల్ శర్మ టీవీ నటిగా కొనసాగుతున్నారు. పర్సనల్ లైఫ్‌లో మాత్రం సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది.సెజల్ శర్మ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: