ఈ మద్య సెలబ్రెటీల వెంట మృత్యువ నీడలా వెంటాడుతుంది.. కాకపోతే కొంత మంది మాత్రం తృటిలో తప్పించుకుంటున్నారు. టాలీవుడ్ సెలబ్రెటీస్ కి రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగిపోతున్నాయి. కారణాలు ఏవైనా కొంత మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆ మద్య నందమూరి ఫ్యామిలీలో నందమూరి జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించగా... నందమూరి హరికృష్ణ సైతం అలాంటి ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇక మాస్ మహరాజ రవితేజ సోదరుడు సైతం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ మద్య డాక్టర్ రాజశేఖర్ రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రెండేళ్ల కింద కమెడియన్ సప్తగిరి హీరోగా సప్తగిరి ఎల్ఎల్బి సినిమాకు అసిస్టెంట్గా పని చేసిన సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆస్పత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు.
తాజాగా ప్రముఖ దర్శకుడు సుశీంద్రన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ఎడమ చేయి ఎముక విరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వెన్నెలా కబడ్డీ కుళు మూవీస్ తో దర్శకుడిగా పరిచయం అయిన సుశీంద్రన్ ఆ మూవీ సంచలన విజయం సాధించడంతో ఆపై వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. విశాల్, కార్తీ వంటి పలువురు యువ స్టార్ హీరోలతో ఆయన వర్క్ చేశారు. ఆయన దర్శకత్వం వహించిన కెనడీ క్లబ్, ఛాంపియన్ సినిమాలు ఇటీవలే విడుదలయ్యాయి. దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకుంటున్న తరుణంలో ఇలాంటి సంఘటన జరగడం అందరికీ షాక్ కి గురి చేసింది.
నేటి ఉదయాన్నే వాకింగ్ వంటి ఎక్సర్సైజులు చేస్తారు. ఈ క్రమంలో వాకింగ్కు వెళుతుండగా బైక్లో వచ్చిన వ్యక్తి సుశీంద్రన్ను ఢీకొన్నారు. దీంతో కింద పడిన సుశీంద్రన్కు తీవ్రగాయాలయ్యాయి. ఎడమ చేతి ఎముక విరిగింది. వెంటనే ఆయనను ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. గాయాలు తీవ్రం కావడంతో కొన్ని రోజులు దర్శకుడు సుశీంద్రన్ ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు చూపించారు.