విభిన్నమైన సినిమాలు  చేసుకుంటూ వరుస విజయాలను సొంతం చేసుకుంటూ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు... సెక్స్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. జనవరి 11వ తేదీన సంక్రాంతి ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ... అదిరిపోయే యాక్షన్ తో...ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే హాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న మహేష్ బాబు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరిపోయింది. ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు  కూడా రాబట్టింది. 

 

 

 కాగా ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా మంచి విజయం సాధించడంతో కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా టూర్ కి వెళ్లారు మహేష్ బాబు. అయితే ఇక్కడ మాత్రం మహేష్ బాబు తర్వాత సినిమాకు సంబంధించి పనులు మాత్రం చకచకా జరిగిపోతున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు తర్వాత సినిమా చేయనున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కు మెరుగులు దిద్దుతూనే ... ఈ సినిమాలో హీరోయిన్ల  ఎంపికపై చిత్ర యూనిట్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కాగా  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఇద్దరు హీరోయిన్లు నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

 

 

 ఇదివరకు భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు తో కలిసి నటించిన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని ఈ సినిమాలో  నటిస్తుంది అనే వార్తలు వచ్చినప్పటికీ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నది ఈ అమ్మడు. మహేష్ సినిమాలో  కైరా అద్వానీ నటించడం కొంత కష్టం గానే కనిపిస్తుంది. మరి మహేష్ సరసన మెరిసే ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు అన్నది  ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమా సూపర్ హిట్ సాధించగా..ఈ  హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతూ మహేష్ బాబు 27వ సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: