టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరుతో సందడి చేశాడు. ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ వసూలు చేసి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ లో ఉన్న మహేశ్ ఫ్యామిలీతో కలిసి అమెరికా వెకేషన్ కు వెళ్లాడు. అయితే యూఎస్ కు వెళ్లింది వెకేషన్ కు మాత్రమే కాదని తెలుస్తోంది. మహేశ్ బాబు తన మోకాలికి సర్జరీ చేయించుకోవడానికి కూడా యూఎస్ కు వెళ్లినట్టు తెలుస్తోంది.

 

 

ఆగడు సినిమా షూటింగ్ సమయంలో మహేశ్ మోకాలిక గాయమైంది. ఆ గాయానికి 2017లో  మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అయితే డాక్టర్ల సలహాలు పాటించకుండా, తగినంత రెస్ట్ తీసుకోకుండా తిరిగి సినిమాలు చేయడంతో ఆ మోకాలి నెప్పి ఈమధ్య తిరగబెట్టిందని అంటున్నారు. అందుకే మళ్లీ సర్జరీ చేయించుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో సర్జరీ జరిగిందని తెలుస్తోంది. దీని కారణంగా మరో అయిదు నెలలు పూర్తి రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాల్సి ఉంది. దీంతో మేలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రారంభమవుతుందని భావిస్తున్న సినిమా మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.

 

 

ఇదే నిజమైతే ఈ ఏడాది మహేశ్ నుంచి మరో సినిమా రావడం కష్టమే. సరిలేరు నీకెవ్వరు విజయానందంలో ఉన్న మహేశ్ అభిమానులకు ఈ వార్త చేదు వార్త అనే చెప్పాలి. సాధారణంగా మహేశ్సినిమా పూర్తవ్వగానే ఫ్యామిలీతో హాలిడే ట్రిప్ కు వెళ్లడం తెలిసిన విషయమే. కానీ.. ఈ సారి సర్జరీ కూడా చేయించుకోవడానికి వెళ్లారనే వార్తతో అభిమానులకు మింగుడుపడని విషయంగా చెప్పాలి. ఈ వార్త నిజమైతే మహేశ్ సినిమా వచ్చే ఏడాది 2021 సంక్రంతికే విడుదలవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: