ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా మహేష్‌బాబు, రష్మిక మందన్నా జంటగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు సమర్పణలో, అనిల్‌ సుంకర 'సరిలేరు నీకెవ్వరు'మూవీ నిర్మించారు. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ రూ.200 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. మహేశ్‌ మేనరిజమ్‌కు అనిల్‌ రావిపూడి కామెడీ టైమింగ్‌ తోడవ్వడంతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది.  ఈ మూవీతో దాదాపు పదమూడేళ్ల తర్వాత లేడి అమితాబ్ విజయశాంతి రీ ఎంట్రీ ఇచ్చింది.  ఈ మూవీలో మహేష్ బాబు, విజయశాంతి, ప్రకాశ్ రాజ్ ల మద్య వచ్చే సీరియస్, కామెడీ సీన్లు థియేటర్లకు ప్రేక్షకులను మళ్లీ మళ్లీ రప్పించాయి. 

 

మొదటి నుంచి ఈ మూవీ పై భారీ అంచనాలే పెరిగాయి.. మహేశ్‌లోని కామెడీ యాంగిల్‌ను చూసిన అభిమానులు ఇలాంటి సినిమా ‘నెవర్‌ బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్‌ ’ అంటూ కామెంట్లు చేశారు.  ఈ మూవీ ద్వారా ప్రేక్ష‌కుల‌ని మ‌రింత న‌వ్వించేందుకు మేక‌ర్స్ కొత్త ఆలోచ‌న చేశారు. సినిమాకి మ‌రిన్ని ఫ‌న్ వీడియోస్ యాడ్ చేసి నేటి నుండి చిత్ర ప్ర‌ద‌ర్శ‌న చేయ‌నున్న‌ట్టు ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ప్ర‌క‌టించింది. మ‌హ‌ర్షి తర్వాత మ‌హేష్ ఖాతాలో మ‌రో హిట్ చేర‌డంతో ఫ్యాన్స్ కూడా పండుగ చేసుకుంటారు.  

 

ఈ సందర్భంగా అనీల్ రావిపూడి మాట్లాడుతూ.. మా మూవీ చూసి అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఎంజారు చేస్తున్నారు. అయితే ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇంకా ఎక్కువ చేయాలని మహేష్‌బాబు, రావురమేష్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ మధ్య వచ్చే ఒక మంచి హిలేరియస్‌ సన్నివేశాన్ని నేటి(శనివారం) ఉదయం షో నుంచి అన్ని సెంటర్లలో యాడ్‌ చేస్తున్నాం. అందుకు చాలా సంతోషంగా ఉంది. పూర్తి వినోదాత్మకంగా రూపొందించిన ఈ మూవీ విజయవంతంగా దూసుకుపోతుంది  అని అన్నారు. మొత్తానికి సంక్రాంతి కానుకగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: