బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాంట్రవర్సీ కామెంట్ చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలిచే కంగనారనౌత్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఆమె నటించిన 'పంగా' సినిమా శుక్రవారం రిలీజ్ కావడంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో కంగనా రనౌత్ చాలా చురుగ్గా పాల్గొంది. ఈ సందర్భం కంగనా రనౌత్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కి తనకు రెండు విషయాల్లో సేమ్ హ్యాబిట్ వుందని మీడియా ముందు తెలిపింది. చాలా వరకు ఇద్దరి విషయాల్లో కొన్ని పోలికలు కనబడుతుంటాయి అంటూ చాలా మంది సెలబ్రిటీలు చెబుతుంటారు అది వాస్తవమే మేమిద్దరం కెరీర్ పరంగా ఎక్కువ వివాదాలు ఎదుర్కొన్నామని కంగనా రనౌత్ తెలిపింది.

 

మరియు అదే స్థాయిలో అభిమానులను కూడా సంపాదించుకోవడం జరిగిందని వచ్చిన వివాదాలకు సరైన రీతిలో జవాబులు కూడా ఇవ్వటం మా ఇద్దరి లో స్పెషాలిటీ అంటూ ఇద్దరికీ దూకుడెక్కువ అని కంగనా రనౌత్ తెలిపింది. అంతేకాకుండా స్పోర్ట్స్ మాన్ జీవితం కూడా అంత సులువైన జీవితం కాదని ఎన్నో కష్టాలని ఎదుర్కొని వస్తూ ఉంటుంది ఆట కోసం వారు ఎంతో సాధన చేస్తారని ఎప్పుడు ఫిట్ గా ఉండటం కోసం ఎంతో కష్టపడి శ్రమిస్తారు అని కంగనా రనౌత్ తెలిపింది. కాగా 'పంగా' సినిమా శుక్రవారం రిలీజ్ అయ్యి ప్రేక్షకులలో అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది.

 

సినిమాలో కంగనారనౌత్ జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిణిగా నటించి ప్రేక్షకులను బాగా అలరించింది. ఈ సినిమాని అశ్వినీ అయ్యర్ తివారి డైరెక్ట్ చేశారు. వీకెండ్ నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో పైగా కంగనారనౌత్ యాక్టింగ్ అదరగొట్టడంతో సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు ఉత్తరాది ప్రేక్షకులు. మరోపక్క 'పంగా' సినిమా యూనిట్ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ప్రమోషన్ విషయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: