'బాహుబలి' సినిమా తో ప్రపంచ సినిమా రంగానికి భారతదేశ సినిమా రంగం స్థాయి ఏంటో నిరూపించాడు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఒకానొక సమయంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ప్రపంచ సినిమా రంగానికి చెందిన వాళ్ళు మాట్లాడుకునేది బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి. కానీ ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న సినిమా ప్రేమికులంతా డైరెక్టర్ రాజమౌళి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో 'బాహుబలి' తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'RRR' సినిమా గురించి ఇంటర్నేషనల్ స్థాయిలో గట్టిగా చర్చలు జరుగుతున్నాయి.

 

దేశవ్యాప్తంగా తో పాటు అంతర్జాతీయంగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అన్న ఉత్కంఠభరితంగా ఉన్నారు సినిమా ప్రేక్షకులు.  ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ మరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటిస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎస్.ఎస్. రాజమౌళి సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే సినిమా షూటింగ్ కొంత ఆలస్యంగా జరుగుతున్నట్లు ఇద్దరు హీరోలు కూడా సమయానికి షూటింగ్ స్పాట్ కి రాలేకపోతున్న ట్లు దీంతో డైరెక్టర్ రాజమౌళి ఇద్దరు హీరోలపై కోప పడినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి.

 

జులై ఆఖరి లో విడుదల చేస్తున్నట్లు డేట్ ప్రకటించి స్టార్టింగ్ లో షూటింగ్ కొంత ఆలస్యం కావడంతో సినిమా రిలీజ్ విషయంలో ఎంతో టెన్షన్ పడుతున్న రాజమౌళికి అనుకున్న టయానికి సినిమా అవుతుందో లేదో అన్న టెన్షన్ లో ఉన్నట్లు ఇందుమూలంగానే ఇద్దరి వివరాలపై రాజమౌళి సీరియస్ అయినట్లు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ సరసన ఒక హాలీవుడ్ తార కనిపించబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: