మనుషులకు పేరుతో పాటు ప్రమాదాలు పక్కనే పోంచి ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు ప్రత్యేకించి అతిధులు అంటు ఎవరు ఉండరు. అందరికి ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయో చెప్పడం కష్టం. ఇకపోతే ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదంలో ప్రముఖ తమిళ దర్శకుడు సుశీంద్రన్ తీవ్రంగా గాయపడ్డారు.

 

 

రోజులాగే వాకింగ్ కు వెళుతున్న సమయంలో ఓ బైకర్ అతన్ని ఢీ కొట్టగా, కింద పడ్డ సుశీంద్రన్ కు తీవ్ర గాయాలవగా, ఎడమచేతి ఎముక విరిగింది. దాంతో ఆయనను వెంటనే ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సుశీంద్రన్ ఆరోగ్యం బాగానే ఉందంటూ వైద్యులు పేర్కొన్నారు. కాని  కొద్ది రోజులు అబ్జర్వేషన్‌ లో ఉంచాలని సూచించారట.. కాగా అతనికి జరిగిన ఈ ప్రమాదం. ప్రమాద వశాత్తు జరగలేదని, ఎవరో కావాలనే ఇలా చేసారని ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో ఈ న్యూస్ ప్రస్తుతం కోలీవుడ్ లో వైరల్ గా మారింది.

 

 

ఇకపోతే ఈ విషయంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుశీంద్రన్ పై హత్యాయత్నం జరిగిందన్న దిశగా దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఇకపోతే సుశీంద్రన్ వెన్నల కబడ్డీ కులు, సినిమాతో దర్శకుడిగా పరిచయం అవగా, కార్తీ హీరోగా వచ్చిన నా పేరు శివ సినిమాతో దర్శకుడిగా మంచి క్రేజ్ సంపాధించుకున్నాడు.. ప్రస్తుతం అయన స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు.

 

 

ఇక లేటెస్ట్ గా ఆయన తీసిన కెనడీ క్లబ్, ఛాంపియన్ సినిమాలు విడుదల అయ్యాయి. ఇదే కాకుండా తక్కువ సమయంలోనే దర్శకుడిగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న సుశీంద్రన్ కు శత్రువులు కూడా తయారు అయ్యారా అని తమిళ ప్రజలు అనుకుంటున్నారట. ఇకపోతే గుండాలకు, రాజకీయ నాయకులకు, బిజినెస్ చేసే వాళ్లకు శత్రువులు ఉంటారు గాని ఇలా సినిమాలు తీసే వాళ్లకు పగవాళ్లు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అనుకుంటున్నారట.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: