కొన్నికొన్ని సార్లు సెల‌బ్రెటీల‌ను గుర్తు ప‌ట్ట‌డం క‌ష్ట‌మ‌వుతుంది. ఒక్కోసారి మ‌న‌లాంటి సాధార‌ణ ప్ర‌జ‌ల మ‌ధ్య వ‌చ్చి స‌ర్వ‌సాధార‌ణంగా తిరుగుతుంటే గుర్తు ప‌ట్ట‌లేక‌పోవ‌డం.  ఇలాంటివ‌న్నీ త‌ర‌చూ జ‌రుగుతూనే ఉంటాయి. ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి తాజాగా వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు న‌సీరుద్దీన్ షా కుమార్తె అయిన హీబా పై ఒక ఆసుప‌త్రి సిబ్బంది పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. 

 

దానికి కార‌ణం లేక‌పోలేదు హీబా నేను ఒక ప్ర‌ముఖ న‌టుడి కుమార్తెను నేనెవ‌రో మీకు తెలీదా అంటూ ఆమె వారి పై దాడికి దిగింది. జ‌న‌వ‌రి 16న ఈ ఘ‌ట‌న జ‌రిగింది.  తన స్నేహితురాలి పెంపుడు పిల్లికి చికిత్స చేయించేందుకు హీబా.. ముంబై వర్సోవా ప్రాంతంలోని తమ ఆసుపత్రికి వచ్చిందని వారు తెలిపారు. ఆ సమయంలో తాము మరో చికిత్స చేస్తూ బిజీగా ఉండటంతో.. కాసేపు వేచి ఉండాల‌ని చెప్ప‌గా... ఆమె సిబ్బంది పై మండిప‌డింది.

 

కోపాగ్ర‌హాల‌తో ఊగిపోయిందని, ఇంకెంతసేపు ఎదురుచూడాలంటూ తమపై కోపగించుకుందని వారు తెలిపారు. అంతేకాక  నేనెవరో మీకు తెలీదా? అంటూ తమను భయపెట్టేందుకు కూడా ప్రయత్నించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడి నుంచి వెళ్లాలంటూ ఆమెకు సూచించిన ఇద్దరు మహిళా సిబ్బంది పై కూడా ఆమె చేయి చేసుకుందని ఫిర్యాదు చేశారు. ఇక ఈమె ప్ర‌వ‌ర్తన అంతా కూడా సీసీటీవీలో ఈ దృశ్యాలన్ని రికార్డయ్యాయని పేర్కొన్నారు. వారి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకు న్నారు పోలీసులు. హీబాపై సెక్సన్లు 323, 504, 506 కింద కేసు నమోదు చేశారు. బాలీవుడ్ నటి అయిన హీబా.. నసీరుద్దీన్ షా, పర్వీన్ మురాద్‌ల సంతానం. దీన్ని బట్టి పెద్ద‌వారు అయినంత మాత్రాన సెల‌బ్రిటీల‌యినంత మాత్రానా ఎలాగైనా బిహేవ్ చెయ్యొచ్చ‌న్న‌ది కుద‌రదు దాన్ని కాస్త ఆలోచించ‌గ‌ల‌రు. ఎక్క‌డ‌కి వెళ్ళినా కూడా రూల్ ఈజ్ రూల్. రూల్ ఫ‌ర్ ఆల్ అన్న కొటేష‌న్ ఉండ‌నే ఉన్న‌ది. దాన్ని దృష్టిలో పెట్టుకుని న‌డుచుకుంటే ఎవ్వ‌రికైనా బావుంటది. 

మరింత సమాచారం తెలుసుకోండి: