2019 లో మొత్తంగా చూస్తే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు దక్కించుకున్న సినిమాలు చాలా తక్కువని చెప్పాలి. అంతేకాదు ఆ సినిమాల సమ్హ్య కూడా నోటితో చెప్పేయొచ్చు. రిలీజ్ అవడానికి చాలా సినిమాలు రిలీజైనప్పటికి హిట్ అయి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలని అందుకుంది మాత్రం అతి తక్కువ సినిమాలు మాత్రమే. ఇక 250 కోట్ల వసూళ్లు క్రాస్ చేసిన సినిమాలు ఇంకా తక్కువని చెప్పాలి. 2019 లో చాలా నమ్మకం పెట్టుకున్న సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈ ఏడాది 2020కి మాత్రం ఆరంభం దక్కింది. బాలీవుడ్ కు ఇది శుభారంభం అంటూ బాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు.

 

అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలో నటించిన తాన్హాజీ సినిమా ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. చత్రపతి శివాజీ సైన్యంలోని కీలక వ్యక్తి అయిన తాన్హాజీ గురించి చరిత్ర మరిచి పోయింది. అలాంటి వ్యక్తి జీవిత చరిత్రను ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో ముందు నుండి వెల్లడిస్తూ సినిమాపై ఆసక్తి కలిగించడంలో సక్సెస్ అయ్యారు. ప్రేక్షకుల్లో పెరిగిన అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండటంతో ఇప్పుడు కలెక్షన్స్ దుమారం రేపుతున్నాయి.

 

తాన్హాజీ సినిమాను దాదాపుగా 150 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా ఆ బడ్జెట్ ను ఈజీగా వెనక్కు రాబట్టి ప్రస్తుతం లాభాల బాటలో ఉంది. రెండు వారాలు పూర్తి అయ్యేప్పటికి ఈ సినిమా దాదాపుగా 260 కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకున్నట్లుగా బాలీవుడ్ ట్రేడ్ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ వీకెండ్ లో మరింత భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని.. లాంగ్ రన్ లో ఈ సినిమా ఖచ్చితంగా 350 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబడుతుందన్న నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు.

 

బాలీవుడ్ లో 2020లో విడుదలైన మొదటి పెద్ద సినిమా 350 కోట్లను వసూళ్లు చేయడం మంచి శుభసూచికం అంటున్నారు. ఇక మన టాలీవుడ్ లో కూడా అజయ్ దేవగన్ మాదిరిగా సంక్రాంతికి అల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ హ్యాట్రిక్ సినిమా 2020 ఆరంభంలోనే టాలీవుడ్ కి మంచి సక్సస్ ని సాధించి శుభారంభాన్ని ఇచ్చిందని అంటున్నారు. ఆ రకంగా అజయ్ దేవగన్ బాలీవుడ్ లో అల్లు అర్జున్ టాలీవుడ్ లో ముందు నిలిచి 2020 కి ప్రారంభంలోనే సక్సస్ ని ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: