ఇటీవల నటించిన అజ్ఞాతవాసితో భారీ డిజాస్టర్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చివరికి రెండేళ్ల విరామం తరువాత మళ్ళి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన పింక్ మూవీ కి అధికారిక రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమాలో పవన్ కళ్యాణ్, ఒక ఫేమస్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. కాగా పవన్ సరసన హీరోయిన్ గా పలువురు పేర్లు ప్రచారం అవుతున్నప్పటికీ ఎవ్వరి పేరు కూడా ఆ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటన చేయాలేదు. దిల్ రాజు, 

 

బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఓ మై ఫ్రెండ్, మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాల దర్శకుడు వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా తరువాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఎల్లుండి అధికారిక పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న ఈ సినిమాను ఒక పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించనున్నట్లు టాక్. తమిళ అగ్ర నిర్మాతల్లో ఒకరైన ఏ ఎమ్ రత్నం సంస్థైన శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఎంతో భారీగా నిర్మితం కానున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత దర్శకుడిగా ఎంపికైనట్లు నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి వార్తలు అందుతున్నాయి. 

 

ఇప్పటికే స్ట్రాంగ్ గా వరుస సినిమా అవకాశాలతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మణిశర్మ అయితేనే ఇటువంటి సినిమాకు పర్ఫెక్ట్ మ్యూజిక్ అందించగలరనే ఉద్దేశ్యంతో దర్శకుడు క్రిష్ ఆయనను ఎంపిక చేసారని, అలానే ఆయన నిర్ణయానికి పవన్ తో పాటు నిర్మాత రత్నం కూడా ఒప్పుకున్నారని, అతి త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. పాన్ ఇండియా ఫీల్ తో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తారని, అలానే విలన్ పాత్రకు కూడా ఈ సినిమాలో మంచి ప్రాధాన్యత ఉందని అంటున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: