సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల నటించిన సరిలేరు నీకెవ్వరు తో మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు తొలుత యావరేజ్ టాక్ వచినప్పటికీ, సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా కాలం తరువాత ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ ని ఈ సినిమాలో పండించడంతో ఆయన ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం సినిమా చూడడానికి బాగానే తరలివచ్చారు. అదీకాక సంక్రాంతి సీజన్ కూడా కావడం, వరుసగా సెలవలు రావడం కూడా ఈ సినిమాకు మరింత కలిసి వచ్చింది. 

 

ఇకపోతే ఈ సినిమా సక్సెస్ తో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న మహేష్ బాబు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇక ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి అమెరికాకు వెకేషన్ కు వెళ్లిన సూపర్ స్టార్, రెండు రోజుల క్రితం తన భార్య నమ్రత శిరోద్కర్ బర్త్ డే ని అక్కడే ఘనంగా సెలెబ్రేట్ చేసారు. ఇకపోతే ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్ కు తన సినీ, వ్యక్తిగత విషయాలు షేర్ చేసే మహేష్ బాబు, నేడు తన ముద్దుల తనయ సితారతో కలిసి దిగిన రెండు ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. ముమ్మూర్తులా మహేష్ బాబు తల్లి అయిన ఇందిరాదేవిని పోలి ఉండే తన కూతరు సితార అంటే మహేష్ కు ఎనలేని అభిమానం, దానితో పాటు చిన్న ఏజ్ లోనే సితారకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. 

 

ఇక తండ్రి కూతుళ్లు ఇద్దరూ కూడా ఎంతో సరదాగా దిగిన ఆ క్యూట్ అడోరబులు ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి. కాగా దాదాపుగా మూడు నెలలు అక్కడే తన ఫ్యామిలీతో సరదాగా గడపనున్న మహేష్ బాబు, ఆ తరువాత అక్కడినుండి తిరిగివచ్చిన అనంతరం మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: