టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోలుగా తెరకెక్కిన వారి తాజా సినిమాలైన సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురములో సినిమాలు ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ ని అందుకుని, బాగా కలెక్షన్స్ ని కూడా రాబట్టడం జరిగింది. మహేష్ బాబుతో కలిసి యువ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు సినిమా మంచి మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా, మహేష్ సరసన యంగ్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ, మహేష్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో పాటు వరుసగా సంక్రాంతి సెలవలు కావడంతో కలెక్షన్స్ కుమ్మేశాయి. 

 

ఇకపోతే మరోవైపు అలవైకుంఠపురములో సినిమాకు కూడా అదిరిపోయే టాక్ అయితే రాలేదు కానీ, దానికి కూడా ఒకింత ఎబోవ్ యావరేజ్ టాక్ రావడం జరిగింది. అయితే బన్నీ మాస్ యాక్షన్ తో పాటు త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, సాంగ్స్, వెరసి ఆ సినిమాను మంచి సక్సెస్ చేయగా, సంక్రాంతి సీజన్ కూడా దానికి బాగా కలెక్షన్స్ రాబట్టడంలో కలిసి వచ్చింది. ఇకపోతే ఇటీవల ఈ రెండు సినిమాల యూనిట్ సభ్యులు, తమ సినిమా గొప్పది అంటే తమ సినిమా గొప్పది అంటూ, ఒకరిని మించేలా మరొకరు సినిమా కలెక్షన్స్ విషయమై ఎప్పటికప్పుడు పోటీ పడుతూ పోస్టర్స్ రిలీజ్ చేసారు. అయితే హఠాత్తుగా మూడు రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ నిర్వహించిన సరిలేరు మూవీ టీమ్, ఇకపై తమ సినిమా కలెక్షన్స్ పోస్టర్స్ రిలీజ్ చేసేది లేదని, 

 

అయితే ఓవరాల్ గా సినిమా క్లోజ్ అయిన తరువాత ఫైనల్ కలెక్షన్స్ ప్రకటించడం జరుగుతుందని చెప్పారు. ఇక దానితో అల టీమ్ కూడా తమ సినిమా కలెక్షన్స్ గురించి పోస్టర్స్ రిలీజ్ చేయడం ఆపేసింది. నిజానికి రెండు సినిమాలు కూడా అదరగొట్టే కలెక్షన్స్ ని సంపాదించాయని, ఇక మొన్నటివరకు ఒకింత మన తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు బాగా రాబడితే, ఓవర్సీస్ లో అల బాగా రాబట్టిందని, ఇక ప్రస్తుతం ఈ రెండు సినిమాల పరిస్థితి ఆల్మోస్ట్ అయిపోయిందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి ఈ రెండు సినిమాల యూనిట్ల వారు ఎట్టకేలకు పోస్టర్స్ వార్ కు తెరదించడంతో ప్రేక్షకులు కూడా హమ్మయ్య మీకు దండం స్వామి అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: