ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుని మించిన క్రిమినల్ మైండ్ ప్రపంచంలో ఎక్కడా ఉండదని పోసాని కృష్ణ మురళి అన్నారు. పోసాని కృష్ణ మురళి ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి కూతురు శ్రీజ మ్యారేజ్ విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన కుట్రను బయటపెట్టారు. 
 
పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ రాజకీయ నాయకులు ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని దీనిని పొలిటికల్ అన్ ఎంప్లాయిమెంట్ అంటారని చెప్పారు. ప్రజలు ఎప్పుడు మారతారో అప్పుడు నిజమైన రాజకీయ నాయకుడిపై ఈగ కూడా వాలనీయరని అన్నారు. జగన్ అమ్మఒడి కార్యక్రమం పెట్టారని అమరావతి ప్రాంతం ప్రజలకు కూడా అమ్మఒడి డబ్బులు వేశారని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రజలకు మాత్రమే అమ్మఒడి డబ్బులు వేయలేదు కదా అని ప్రశ్నించారు. 
 
చిరంజీవి గారి అమ్మాయి ప్రేమ పెళ్లి విషయంలో ఇంట్లో ఆడవాళ్లని కంట్రోల్ చేయలేని చిరంజీవి దేశాన్ని ఎలా కంట్రోల్ చేస్తాడని అనిపిస్తావా...? అని చంద్రబాబును పోసాని ప్రశ్నించారు. చిరంజీవి ఫ్యామిలీని టీడీపీ పార్టీ నేతలతో అప్పట్లో తిట్టించలేదా..? అని చంద్రబాబును ప్రశ్నించారు. రెండు మూడు నెలలు అదే పనిగా చిరు ఫ్యామిలీని చంద్రబాబు టార్గెట్ చేశారని అన్నారు. వాళ్లు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే కనీసం తప్పు అని చెప్పావా...? అని చంద్రబాబును పోసాని ప్రశ్నించారు. చిరంజీవి సెన్సిటివ్ కాబట్టి అతన్ని ఇబ్బందులకు గురి చేశారని పోసాని అన్నారు. 
 
ఆ సమయంలోనే చంద్రబాబుపై తనకు ద్వేషం పుట్టిందని పోసాని అన్నారు. చంద్రబాబు కుటిల రాజకీయనాయకుడని అతని అసలు రూపాన్ని అప్పుడే చూశానని చెప్పారు. చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడు మాత్రమేనని ప్రజా నాయకుడు ఎప్పటికీ కాలేడని పోసాని అన్నారు. చంద్రబాబు పుట్టగానే టాటా బిర్లా ఫ్యామిలీలో పుట్టడా..? అని పోసాని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు హెరిటేజ్ తో అక్రమాలు చేశారని పోసాని అన్నారు. ప్రజలు చంద్రబాబును అర్థం చేసుకున్నారు కాబట్టే కాళ్లు విరగ్గొట్టి ప్రతిపక్ష నాయకుడి సీట్లో కూర్చోబెట్టారని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: