చాలా మంది పుస్త‌క ప్రియులు ఉంటారు. కొంత మంది హాబీగా మారి ఎప్పుడు చూసినా అదే ప‌నిలో ఉంటారు. ఎప్పుడూ ఏవో ఒక బుక్స్ తీసుకుని చ‌దువుతూనే ఉంటారు. వారిలో ఎక్కువ‌గా మ‌న సినిమా వాళ్ల విష‌యానికి వ‌స్తే ముందు వ‌రుస‌లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఉంటుంది. అలాగే ద‌ర్శ‌కుల విష‌యానికి వ‌స్తే... త్రివిక్ర‌మ్‌, క్రిష్ లాంటి వారు కూడా పుస్త‌క పురుగులే. వీళ్ళు అంతా కేవ‌లం సినీ ప్రేమికులే కాదు పుస్త‌క ప్రేమికులు కూడా అని చెప్ప‌వ‌చ్చు. 

 

ఇక ఈ పుస్త‌కాలు చ‌దివే విష‌యంలో పాల‌నురుగుల మిల్కీ బ్యూటీ కూడా ఉంది. త‌మ‌న్నాకి పుస్త‌కాలు చ‌ద‌వ‌డ‌మంటే చాలా ఇష్ట‌మ‌ట‌. కానీ త‌న‌కుండే బిజీ లైఫ్‌లో కుద‌ర‌డంలేదంటూ...పుస్త‌కాల‌కు దూర‌మ‌యిన‌ట్లు ఆవేద‌న వ్య‌క్తం చేసింది. త‌న లైఫ్ స్టైల్‌ని మార్చేసిన ఒక రెండు పుస్త‌కాల గురించి కూడా ఎంతో ప్ర‌త్యేకంగా చెప్పింది. 

 


తాను ప్ర‌స్తుతం ఆధ్యాత్మ‌క‌త‌లో ఉన్నాన‌ని.  అందుకు కార‌ణం `ఓషో` అనే పేరు గ‌ల పుస్త‌కం వ‌ల్లే త‌ను ఆధ్యాత్మిక‌త‌ను అర్ధం చేసుకోవ‌డానికి ప‌నికొచ్చింద‌ని చెప్పుకొచ్చింది. అలాగే త‌న‌ జీవనశైలి పై విపరీతమైన ప్రభావాన్ని చూపిన మరో పుస్తకం రోరే ఫ్రీడ్మాన్ అండ్ కిమ్ బర్నౌయిన్ రాసిన `స్కిన్నీ బిచ్`. ఆ పుస్తకం చదివిన తర్వాతే నేను మాంసాహారం మానేశాను అని ఆమె చెప్పింది. ఆ పుస్త‌కం చ‌దివిన త‌ర్వాత త‌న‌కు నాన్‌వేజ్ మీద అస్స‌లు ఉండేది కాద‌ని అస‌లు తినడానికి ఇష్ట‌ప‌డ‌లేద‌ని చెప్పింది. 

 


గ‌త ఏడాదిలో వెంక‌టేష్‌తో క‌లిసి ఎఫ్‌2 లో న‌టించి మంచి విజ‌యాన్ని సాధించింది. త‌ర్వాత చిరంజీవితో క‌లిసి సైరా న‌రసింహారెడ్డిలో త‌న పాత్ర‌కు ఎంతో మంచి పేరు వ‌చ్చింది. ఒక ర‌కంగా చెప్పాలంటే త‌మ‌న్నా త‌న పాత్ర‌లో లీన‌మ‌యి చేసింద‌ని చెప్పాలి. సంక్రాంతి బరిలో నిలిచిన సరిలేరు నీకెవ్వరులో స్పెషల్ పార్టీ సాంగ్ తో కుర్ర‌కారుని ఆక‌ట్టుకుంది. ఎప్ప‌టినుంచో వాయిదాలో  ఉన్న దటీజ్ మహాలక్ష్మి విడుద‌ల  కోసం వేచి చూస్తోంది. అంతేకాక గోపిచంద్‌తో క‌లిసి క‌బ‌డి నేప‌ధ్యంలో తెర‌కెక్కుతున్న మ‌రో చిత్రంలో కూడా హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: