‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి రేస్ విన్నర్ కాకపోయినప్పటికీ పట్టు విడవకుండా మహేష్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నప్పటికీ ఈ సినిమా ప్రమోషన్ కొనసాగిస్తున్నాడు. మహేష్ అమెరికా వెళ్లకముందు రికార్డు చేయబడ్డ ఆర్మీ జవానులతో గడిపిన ఒక కార్యక్రమం ఒక ప్రముఖ ఛానల్ ఈరోజు ప్రసారం చేస్తోంది.

ఇది ఇలా ఉండగా మరొక ప్రముఖ మీడియా సంస్థకు మహేష్ ఈరోజు జరుగుతున్న రిపబ్లిక్ డే సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీ రికార్డుల పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇండస్ట్రీ రికార్డులకు సంబంధించి చీప్ ట్రిక్స్ తాను చేయనని అదేవిధంగా ఎదుటి వ్యక్తి వర్క్ పై నెగెటివ్ గా మాట్లాడటం తనకు రాదు అంటూ కామెంట్స్ చేసాడు. 

అంతేకాదు తాను ఇప్పటి వరకు కెరియర్ లో సాధించిన విజయాలు అన్నీ తన మంచితనం వల్ల అదేవిధంగా తన కృషి వల్ల వచ్చిన విజయాలు కాని తనకు తానుగా తానెప్పుడు ప్రమోట్ చేసుకోను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ముఖ్యంగా తన కుటుంబ సభ్యుల సహకారం తన అభిమానుల ప్రేమ వల్ల తాను ఇంతకాలం ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయాలను వివరిస్తూ రాజకీయాలు చేసి పబ్లిసిటీతో లేని కలక్షన్స్ తన సినిమాకు ఆపాదించుకోవడం తనకు రాదు అంటూ కామెంట్స్ చేసాడు.

దీనితో ఈ ఇంటర్వ్యూలో మహేష్ చేసిన కామెంట్స్ బన్నీ ‘అల వైకుంఠపురములో’ మూవీని టార్గెట్ చేస్తూ అన్న కామెంట్స్ మాత్రమే అంటూ ప్రచారం జరుగుతోంది. దీనితో మహేష్ కామెంట్స్ కు ‘అల వైకుంఠపురములో’ టీమ్ నుండి వ్యూహాత్మక స్పందన వస్తుందా అన్న కోణంలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ మహేష్ బాబు ల మధ్య ఇగో వార్ నడుస్తున్న నేపధ్యంలో ఈ కామెంట్స్ ఎలాంటి వార్ కు దారి తీస్తాయి అన్న విషయం పై ఇప్పుడు ఇండస్ట్రీలో ఆ సక్తికర చర్చలు జరుగుతూ ఈ వివాదం ఎంత దూరం పోతుందో అన్న సందేహాలు కలుగుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: