స్టార్ హీరోలందరూ ఇటు సినిమాలతో పాటు మరో వైపు బిజినెస్ వ్యవహారాలు కూడా చేస్తుంటారు. అయితే వారి బిజినెస్ లన్నీ దాదాపుగా సినిమా చుట్టూనే తిరుగుతుంటాయి. సినిమాని దాటి వ్యాపారం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. అలా సినిమా చుట్టూ వ్యాపార చేసేవాళ్లలో మహేష్ కూడా ఒకడు. సూపర్ స్టార్ మహేష్ బాబు మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సక్సెస్ లో ఉన్నాడు.

 

 

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పాటు మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ప్రస్తుతం మహేష్ బాబు తన ఫ్యామిలీతో వెకేషన్ లో ఉన్నాడు. అయితే తన తర్వాతి సినిమా వంశీ పైడిపల్లితో ఉండనుంది. ఇదిలా ఉంటే, మహేష్ బాబు మరో మల్టీప్లెక్స్ కట్టే ఆలోచనలో ఉన్నాడట.

 

 

మహేష్ బాబు మల్టీప్లెక్స్ బిజినెస్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.  ఏఎంబీ సినిమాస్ పేరుతో హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో అధునాతన హంగులతో మల్టీప్లెక్స్ నిర్మించాడు. మహేష్ చరీష్మా కారణంగా అతి తక్కువ కాలంలోనే ఏఎంబీ సినిమాస్ చాలా బాగా పాపులర్ అయింది. సెలబ్రిటీలు సైతం కుటుంబాలతో కలిసి అక్కడే సినిమాలు చూస్తున్నారు. ఏఎంబీ సినిమాస్ నిర్మించినందుకు మహేష్ కు ఏఎంబీ బృందానికి ప్రేక్షకులకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. 

 

 

ఇదిలా ఉంటే తాజాగా మహేష్ మరో అధునాతన హంగులతో అదిరిపోయే మల్టీప్లెక్స్ ను నిర్మించనున్నట్లు వార్తలు వస్తునాయి. అయితే ఈ సారి హైదరాబాద్ లో కాదట. బెంగళూరు నగరం నడిబొడ్డున ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం జరగనుందట. ప్రస్తుతానికి ఈ వార్తపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఫిల్మ్ సర్కిల్స్‌లో మాత్రం ఇది హాట్ టాపిక్‌గా మారింది. మరి మరో  ఏఎంబీ  సినిమాస్ ని నిజంగా నిర్మిస్తున్నాడా లేదా తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: