తెలుగు ఇండస్ట్రీలో వారసులు ఎంత మంది ఉన్నారో అందరికీ తెలిసిందే. అయితే వారసులని ఇండస్ట్రూకి పరిచయం చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కో పద్దతిని ఫాలో అవుతుంటారు. అలా కొత్తగా ఫాలో అవుతున్న వారిలో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు చేరిపోయాడు. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం "ఉప్పెన" . ఈ సినిమా ఫస్ట్ లుక్ మొన్ననే రిలీజ్ అయింది.

 

 

అయితే ఈ ఫస్ట్ లుక్ లో వైష్ణవ్ తేజ్ సముద్రం ముందు నిల్చుని అటువైపు చూస్తూ నేనే గెలిచానన్నట్టుగా రెండు చేతులు లేపి ఆకాశానికేసి చూస్తున్నాడు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో వైష్ణవ్ తేజ్ మొహం కనబడలేదు. మొహం కనబడకపోయినా లుక్ మాత్రం చాలా బావుందన్న రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇదే ఫార్ములాని ఆ సినిమా హీరోయిన్ విషయంలోనూ కొనసాగిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కొత్త అమ్మాయిని తీసుకున్నారు.

 

 

కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం నుండి ఆమె లుక్ ని రివీల్ చేశారు. నేటి రిపబ్లిక్ డే సందర్భంగా కృతి పోస్టర్ ను రిలీజ్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తొలకరి జల్లులో కన్నె పిల్ల తుళ్లింత ఎలా ఉంటుందో ఈ పోస్టర్ లో ఎలివేట్ చేశారు. కృతి ఎంతో ఉల్లాసంగా ఓ బస్సు ముందు చున్నీ గాల్లోకి ఎగరేయడమే కాదు.. ప్రేమైక లోకంలో విహరిస్తూ.. ఎగిరి గంతేస్తోన్నట్లుగా చూపించారు. 

 

 

తొలి పోస్టర్ లో సముద్రం ముందు హీరోను ను... మలి పోస్టర్ లో వర్షం చినుకుల్లో తడుస్తున్న హీరోయిన్ ను చూపించడం తోనే కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ అనే అనిపిస్తోంది. అయితే ఈ రెండు పోస్టర్లలోనూ మొహాలు కనిపించకుండా మేనేజ్ చేశారు. మరి అలా ఎందుకు చేశారన్నై వారికే తెలియాలి. హీరో హీరోయిన్ల కంటే కథకే ఎక్కువ కనెక్ట్ కావాలన్న ఉద్దేశ్యమే అయుంటుందని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: