టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. కొన్నేళ్ల నుండి ఎక్కువగా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న సూపర్ స్టార్, ఈ సినిమాతో ఒక్కసారిగా తన స్టైల్ మార్చి ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో నటించడంతో పాటు సంక్రాంతి సీజన్ కావడం కూడా ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. మహేష్ బాబు ఒక మిలిటరీ మేజర్ గా నటించిన ఈ సినిమాకు యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకరలు కలిసి ఈ సినిమాకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. ఇకపోతే సంక్రాంతి తరువాత కూడా ఈ సినిమా బాగానే కలెక్షన్స్ ని రాబడుతోంది. 

 

వాస్తవానికి ఈ సినిమాకు ఓవర్సీస్ ఏరియాలో మాత్రం ఆశించిన రేంజ్ లో కలెక్షన్స్ అయితే రావడం లేదని, కాకపోతే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా మంచి కలెక్షన్ వస్తున్నట్లు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. సెకండ్ వీక్ పూర్తయ్యే సరికి ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.106.6 కోట్ల షేర్ తో ఆల్ టైం టాప్ 4 వ ప్లేస్ లో కొనసాగుతున్నట్లు చెప్తున్నారు. అలాగే వరల్డ్ వైడ్ మొత్తంగా రూ. 129 కోట్ల షేర్ తో అల్ టైం టాప్ 5 గా నిలిచింది. వీక్ డేస్ లో కొంత డ్రాప్స్ కనిపించినప్పటికీ, వీకెండ్ రోజుల్లో కాస్త పుంజుకొని నిన్న ఈ సినిమా రూ.1.15 కోట్ల షేర్ సాధించిందట. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయి 15 రోజులు గడవడంతో ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం....!!

 

‘సరిలేరు నీకెవ్వరు’ ఆంధ్ర – తెలంగాణ 15 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:  

 

నైజాం – రూ. 35.40 కోట్లు 

సీడెడ్ – రూ.14.89 కోట్లు 

గుంటూరు – రూ.9.36 కోట్లు 

ఉత్తరాంధ్ర – రూ.18.25 కోట్లు 

తూర్పు గోదావరి – రూ.10.69 కోట్లు 

పశ్చిమ గోదావరి – రూ.7.02 కోట్లు 

కృష్ణా – రూ.8.36 కోట్లు 

నెల్లూరు – రూ.3.89 కోట్లు  

15 రోజుల మొత్తం షేర్ – రూ.107.86 కోట్లు

 

మరింత సమాచారం తెలుసుకోండి: