గణతంత్ర దినోత్సవం పురష్కారించుకొని కేంద్ర ప్రభుత్వం 71వ పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ జాబితాలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ఉండటం విశేషం. ఎన్నో సినిమాలల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన కంగనా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో సినిమాలకు ప్రశంసలతో పాటుగా అవార్డులను కూడా అందుకుంది. 

 

గాడ్ ఫాథర్ ఫ్యామిలాగా కాకుండా సోలో ఫైటర్ గా అడుగు పెట్టిన కంగనా ఈనాడు అందరు అభినందించేస్తాయికి చేసురుకుందంటే మామూలు విషయం కాదు.14 ఏళ్ల సినీ ప్రయాణంలో చెప్పుకోదగిన పాత్రలెన్నో చేసింది. నటిగా పలుమార్లు జాతీయ పురస్కారాలు సొంతం చేసుకుంది.. ‘గ్యాంగ్‌స్టర్‌’(2006) సినిమా ద్వారా బాలీవుడ్‌కి పరిచయమైన కంగనా.. 2007లో వచ్చిన  ‘లైఫ్‌ ఇన్‌ ఏ మెట్రో’ చిత్రంతో సెన్సేషనల్ స్టార్ గా మంచి గుర్తింపును అందుకుంది.

 

అలా వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నా కంగనా ‘క్వీన్, తను వెడ్స్‌ మను’ సినిమాకు జాతీయ ఉత్తమ నటి అవార్డులను అందుకుంది.ఫోర్బ్స్‌ ఇండియా 100 లిస్ట్‌లో ఆరు సార్లు చోటును దక్కించుకుంది. అలాగే ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ సినిమాలో నటించింది. నటిగానే కాకుండా నిర్మాతగాను, మాటల రచయితగాను క్వీన్ చిత్రానికి వ్యవహరించింది. 


ఇది ఇలా ఉండగా ఎటువంటి సినిమా బ్యాగ్ గ్రౌండ్ లేని కంగనా ఇంత సక్సెస్ ను అందుకోవడం పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. నటిగా రాణిస్తున్నప్పటి వివాదాలతో కూడా బాగా పాపులర్ అవుతూ వస్తుంది కంగనా. ప్రస్తుతం కంగనా లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ వస్తుంది. అవార్డును  అందుకున్నకంగనాకు ఆమె అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎంతైనా నోరు ఉన్నవాళ్ళకి అవార్డులు అంటూ పలువురు విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతుంది. 

#KanganaRanaut, @karanjohar & @ektaravikapoor to be honoured with #PadmaShri | https://t.co/I3NCcH53eQ pic.twitter.com/ldJz44jToG

— ET Panache (@ETPanache) January 26, 2020 " />

మరింత సమాచారం తెలుసుకోండి: