తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్ సినిమా లలో నటిస్తూ వస్తున్నాడు. అయితే ఈ మధ్య వచ్చిన ప్రతి సినిమా హిట్ టాక్ తూ దూసుకుపోతున్నాయి. అందుకే మహేష్ ఇప్పుడు ఎటు చుసిన కూడా పేరు మారుమోగిపోతుంది. ఇకపోతే సినిమాలలో నటిస్తున్న హీరోయిన్లకు కూడా మంచి పాపులర్ వస్తున్నా సంగతి తెలిసిందే. అందుకే మహేష్ సినిమాలంటే అభిమానులకు మంచి క్రేజ్ ఉందని వేరేలా చెప్పనక్కర్లేదు. 

 

తాజాగా మహేష్ బాబు నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరూ చిత్రం ఇటీవల విడుదలయ్యి సంచలనాలు సృష్టించింది. ఈ క్రమంలో సినిమా సూపర్ టాక్ తెచ్చుకోవడంతో చిత్ర యూనిట్ తో పాటుగా అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జవాన్ల క్యాంప్ కార్యాలయాలను సందర్శించాడు. జవాన్లు చేసే పనులు వర్ణనాతీతం అని అందరు అంటున్నారు. 

 

ధైర్య, సాహసాల తో విధులు నిర్వర్తించే మన జవాన్లను కలవడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని సినీనటుడు మహేశ్ బాబు అన్నారు. తాజాగా, జవాన్ల తో కలిసినప్పుడు తీసుకున్న ఫొటో లను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజుల్లో ఈ రోజు కూడా నిస్సందేహంగా ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పారు. 

 


ప్రతిరోజు కాపాడుతోన్న భారత హీరోల కు (జవాన్లకు) సెల్యూట్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశాన్ని రక్షిస్తున్న వీళ్ళు మన పాలిట దేవుళ్ళనే చెప్పాలి అంటూ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం వంశీ పైడి పల్లి దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు.మహర్షి సినిమాతో హిట్ టాక్ తో వచ్చిన వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రావడంతో అభిమానులు సంతోషంలో ఉన్నారు.   ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
  

 

మరింత సమాచారం తెలుసుకోండి: