మహేష్ బాబు వరస సినిమాలతో దూకుడుగా ఉన్నాడు. భరత్ అనే నేను సినిమా నుంచి మహేష్ బాబు చేస్తున్న సినిమాలు అన్నీకూడా సూపర్ హిట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ స్టార్ హీరో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా మంచి విజయం దక్కించుకుంది. ఈ విజయంతో మహేష్ బాబు ఫుల్ ఖుషీగా ఉన్నాడు. మరోవైపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహేష్ బాబు సైనికులను కలిశారు. వారితో సరదాగా గడిపారు.
ఇదిలా ఉంటె, సినిమా ఇండస్ట్రీలో మహేష్ నటుడిగానే కాకుండా, నిర్మాతగా కూడా మెప్పిస్తున్నారు. మరోవైపు సినిమా రంగంలో ముల్టీప్లెక్స్ థియేటర్స్ ను ఏర్పాటు చేసి ఆ విధంగా కూడా మహేష్ బాబు దూసుకుపోతున్నారు. హైదరాబాద్ లో ఏఎంబి సినిమాస్ ప్రగతిపథంలో పయనిస్తోంది. ఇప్పుడు మహేష్ బాబు దృష్టి కర్ణాటకపై పడింది. కర్ణాటకలోని బెంగళూరులో మహేష్ బాబుకు ఫ్యాన్స్ ఎక్కువ.
ఇప్పడు బెంగళూరులో కూడా మరో ఏఎంబి సినిమాస్ ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల్లో మల్టీప్లెక్స్ లను ఏర్పాటు చేయాలనీ మహేష్ బాబు అనుకుంటున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే హైదరాబాద్ తరువాత దృష్టిని బెంగళూరుపై పెట్టారు. బెంగళూరులో కూడా అద్భుతమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలనీ మహేష్ బాబు అనుకుంటున్నారు.
కాగా, ఎప్పుడు మొదలుపెడతారు అన్నది చూడాలి. ఇకపొతే, మహేష్ బాబు సరిలేరు తరువాత ఇప్పుడు వంశి పైడిపల్లితో సినిమా చేయబోతున్నారు. మే నుంచి ప్రారంభం కాబోతున్నది. జేమ్స్ బాండ్ తరహా కథతో సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. వచ్చే సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాతలు ఎవరు అన్నది తెలియాల్సి ఉన్నది. హీరోయిన్లు ఎవరు, మిగతా తారాగణం ఏంటి అనే విషయాలను త్వరలోనే ప్రకటిస్తారట.