బాహుబలి రెండు భాగాల సూపర్ డూపర్ హిట్స్ తో టాలీవుడ్ సినిమా పేరుని ప్రపంచవ్యాప్తంగా దశదిశలా వ్యాప్తింపచేసిన దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి, ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో తెరకెక్కిస్తున్న భారీ హిస్టారికల్ మల్టిస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్, ఇప్పటికే 85 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమతో పాటు పలువురు కోలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలకు చెందిన నటులు కూడా నటిస్తున్న ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. 

 

డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇకపోతే నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ మొత్తం కలిసి ఈ వేడుకను ఎంతో గొప్పగా జరుపుకున్న ఫోటోలను ఆ మూవీ యూనిట్, కాసేపటి క్రితం తమ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఫోటోలు పోస్ట్ చేసింది. దర్శకుడు రాజమౌళి సహా సినిమా యూనిట్ సభ్యులందరూ కూడా మన జాతీయ జండాకు గౌరవ వందనం చేయడం ఆ ఫొటోల్లో గమనించవచ్చు. ఇక కాసేపటి క్రితం రిలీజ్ అయిన ఆ ఫోటోలు ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి. 

 

అయితే హీరోలిద్దరూ కూడా ఆ ఫొటోల్లో కనపడకపోవడం ఒకింత వారి ఫ్యాన్స్ కు అది నిరాశే అని అంటున్నారు సినీ విశ్లేషకులు. స్కాట్, లేడీ స్కాట్స్ విలన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు ముగించి ఈ సినిమాని జులై 30న వరల్డ్ వైడ్ ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్.....!!   

మరింత సమాచారం తెలుసుకోండి: