ప్రస్తుతం ఎన్టీఆర్..రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం తారక్.. ఆర్ఆర్ఆర్ తప్ప మరో సినిమా ఆలోచించే పరిస్థితి లేదు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలితో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న రాజమౌళి, తన నెక్ట్స్ సినిమా ఆర్ఆర్ఆర్ను కూడా అదే స్థాయిలో ప్లాన్ చేశారు. ఇక ఎన్టీఆర్కు జోడిగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంటే, చరణ్కు జోడిగా హిందీ నటి అలియా భట్ నటిస్తోంది.
ప్రస్తుతం షూటింగ్ వికారాబాద్ అడవుల్లో జరుగుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్తో పాటు మరో కీలక పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా ఎన్టీఆర్ ఓ వాణిజ్య ప్రకటన కోసం ముంబై వెళ్లి తిరిగి వచ్చాడు. తిరిగి వస్తుండగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. విమానాశ్రయం నుంచి తిరిగి వస్తున్న సమయంలో కొందరు ఫోటోగ్రాఫర్స్ ఎన్టీఆర్ ని చుట్టుముట్టి కొన్ని ఫ్లాష్ లు మెరిపించారు. ఆ వెంటనే ఎన్టీఆర్ అక్కడ ఉన్న ఓ ఫోటోగ్రాఫర్ పై అదిరిపోయే పంచ్ లే వేశారు. ``నువ్వు ఇంక ఇంటికి వెల్లవా? తిండి నిద్రా అన్నీ ఇక్కాడేనా?`` అని ఎన్టీఆర్ అతనిపై ప్రశ్నల వర్షం కురిపించాడు.
అయితే దీనికి కారణం ఎన్టీఆర్ ముంబైకి వెళ్లే సమయంలో కూడా అదే ఫోటో గ్రాఫర్ ఫోటోలు తీయడానికి ప్రయత్నించాడు. దీనితో ఎన్టీఆర్ అతడిని గుర్తుపట్టి సరదాగా ఆటపట్టించాడు. ఇక స్వయంగా ఎన్టీఆర్ తనని గుర్తుపట్టడంతో సదరు ఫోటో గ్రాఫర్ సంతోషానికి అవధులు లేవు. ఫోటో గ్రాఫర్ తో సరదా సంభాషణ ముగిసిన వెంటనే ఎన్టీఆర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాస్తవానికి సాటి హీరోలు బావుండాలని.. ప్రజలు, అభిమానులు బావుండాలని కోరుకునే స్వభావం తారక్ ది. అందుకే అతడు అందరివాడు అయ్యాడు. ఎక్కడాలేని అభిమానాన్ని సంపాదించుకున్నాడు.