ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ మ‌ధ్య సినిమాల‌కు చాలా గ్యాప్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఆయ‌న జ‌న‌సేన‌పార్టీ పెట్టి రాజ‌కీయాల‌తో బిజీ అయిపోయారు. అజ్ఞాత‌వాసి చిత్రం త‌ర్వాత ఆయ‌న ఏ సినిమా కూడా తీయ‌లేదు. తిరిగి మ‌ళ్ళీ ఇప్పుడే బాలీవుడ్ మూవీ పింక్‌ని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ఆ చిత్రంతో తిరిగి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. ఇక ఈ విష‌యం ఇలా ఉంటే ప్ర‌స్తుతం ఆయ‌న క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో కూడా మ‌రో చిత్రంలో న‌టించ‌నున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు కొనసాగుతున్నట్లు టాక్‌.

 

ఇక మరో వార్త ఏంటంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు  పవన్‌తో కలిసి సందడి చేయనున్నారట. డైరెక్టర్‌ క్రిష్‌ పాన్‌ ఇండియా కథాంశంతో చారిత్రాత్మక పీరియాడిక్‌ డ్రామాగా ఈ ప్రాజెక్టును తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే స్పష్టత రానున్నట్లు సమాచారం. ఇక ఇదిలా ఉంటే మూడేళ్ళ క్రిత‌మే ఐదు కోట్లు అడ్వాన్స్ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్. తన అఫిడవిట్ లో కూడా పవన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. సో.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పవన్ సినిమా చేస్తే అది కచ్చితంగా అది హరీశ్ శంకర్ దర్శకత్వంలోనే ఉంటుంది. దిల్ రాజుతో పాటు మ‌రో ఇద్ద‌రు అగ్ర నిర్మాత‌లు కూడా ఉన్నార‌ని టాక్‌.

 

ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌కీయాల‌తో పాటు సినిమాల్లో కూడా కాస్త యాక్టివ్‌గానే ఉన్నార‌ని చెప్పాలి. ఆయ‌న ఆల్రెడీ రెండు సినిమాల్లో ఇప్ప‌టికే న‌టిస్తున్నారు. దాంతో పాటు ఉద‌యం సినిమా షూటింగ్‌లో ఉంటే సాయంత్రం  నుంచి  రాజ‌కియాల్లో బిజీగా ఉంటున్నారు. రెండు ప్ర‌క్క‌లా చూసుకుంటూ ప‌వ‌న్ వీరంద‌రి బాకీలు తీర్చ‌గ‌ల‌రా. ఆయ‌న గ‌తంలో మాట ఇచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఫాస్ట్‌గా పూర్తి చేయ‌గ‌ల‌రా అన్న అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ సినిమాల పైన ఫోక‌స్ ఆయ‌న ఎంత వేగంగా పెంచితే అంత మంచిది.  

మరింత సమాచారం తెలుసుకోండి: