బాహుబలి, సాహో సక్సెస్ ఫుల్ చిత్రాల తరువాత రెబల్ స్టార్ ప్రభాస్ తన నెక్స్ట్ మూవీ షూటింగ్ లో బిజీ అయ్యాడు. ఇవాళ్టి నుంచి ఆ సినిమా సెట్స్ పైకి వచ్చింది. గోపికృష్ణ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థతో అనుబంధంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీని రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. బిగ్ బడ్జెట్ ప్యాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో వస్తోంది. ఈ చిత్రం కోసం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక ప్రత్యేక సెట్ లో ప్రభాస్, పూజా హెగ్డే పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. 

 

కమల్ కన్నన్ ఈ చిత్రానికి విఎఫ్ఎక్స్ విభాగంలో పని చేస్తుండడం విశేషం. తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో మొదలైన ఈ చిత్ర షెడ్యూల్ పూర్తి అయ్యింది, దీంతో మూడో షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నెక్స్‌ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రభాస్, పూజా హెగ్డే, న‌టిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటర్ :శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : రవీందర్, సమర్పణ : గోపికృష్ణ మూవీస్ కృష్ణం రాజు, బ్యానర్ : యూవీ క్రియేషన్స్,  నిర్మాతలు: ప్రమోద్, వంశీ, దర్శకుడు : కే కే రాధాకృష్ణ కుమార్. 

 

ఇక దీన్ని బ‌ట్టి ఆయ‌న సినిమాను లేట్‌గా స్టార్ట్ చేసినా కూడా క‌రెక్ట్ టైంకే అందించేలా ఉన్నారు డార్లింగ్ స్పీడ్ పెంచిన‌ట్లే అని చెప్పాలి. మ‌రి ఇప్పటి వ‌ర‌కు జ‌త‌క‌ట్ట‌ని పూజా ప్ర‌భాస్‌ల కాంబినేష‌న్ తెర మీద ఎలా ఉండ‌బోతుందా అని ఆయ‌న ఫ్యాన్స్ ఎంతో ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు. అలాగే ప్ర‌భాస్ ఈ మ‌ధ్య న‌టించే చిత్రాల‌న్నీ కూడా దాదాపుగా హై బ‌డ్జెట్‌తోనే తెర‌కెక్కుతున్నాయి. సినిమా కథ సంగ‌తి ఎలా ఉన్నా కూడా ఆయ‌న సినిమాలు బిజినెస్‌కి మాత్రం ఢోకా ఉండ‌డం లేదు. ఈ సినిమా ఓవ‌ర్సీస్ బిజినెస్ అప్పుడే అయిపోయింద‌ని స‌మాచారం.  చాలా కాలం త‌ర్వాత ల‌వ్ స్టోరీలో న‌టించ‌బోతున్నారు కాబ‌ట్టి తిరిగి మ‌ళ్ళీ ఆయ‌న ప్రేక్ష‌కుల‌కు కొంచం కొత్త‌గా క‌నిపిస్తార‌నే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: