టాలీవుడ్లో కొంత మంది హీరోలు ఏదైనా ఒక సినిమా చేసిన తర్వాత కొంత విశ్రాంతి కొరకు కాస్త గ్యాప్ని తీసుకుంటూ ఉంటారు. మరికొందరు విరామం లేకుండా పని చేస్తుంటారు. అయితే సూపర్స్టార్ మహేష్ మాత్రం తన ప్రతి సినిమా పూర్తవగానే ఖచ్చితంగా మూడు నెలల పాటు గ్యాప్ తీసుకుంటారు. ఫ్యామిలీతో గడపడం కోసం ఎప్పటికప్పుడు సినిమా సినిమాకి కాస్త గ్యాప్ మెయిన్టెయిన్ చేస్తూ ఇటు ఫ్యామిలీని అటు ఫ్యాన్స్ని ఇద్దరినీ జాగ్రత్తగా సాటిస్ఫై చేసుకుంటూ వస్తూ ఉంటారు.
ఇక ఇదిలా ఉంటే ఇటీవలె సంక్రాంతి బరిలో విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్రం మంచి హిట్ కొట్టడంతో ఆయన ఫ్యామిలీతో కాస్త స్పెండ్ చెయ్యడానికి మూడు నెలల పాటు గ్యాప్ తీసుకున్నట్లు సమాచారం. ఇక ఇదిలా ఉంటే ఆయన నటించిన ఆగడు చిత్ర షూటింగ్ సమయంలో అనుకోకుండా ఆయన మోకాలుకి దెబ్బ తగిలింది. దీంతో డాక్టర్లు ఆయనకు శస్త్రచికిత్స అవసరమని చెప్పారు. కాని ఆయన దాన్ని చాలా ఈజీగా తీసుకున్నారు. ‘స్పైడర్’ చిత్రం తర్వాత శస్త్రచికిత్స చేయించుకోవాలని భావించినప్పటికీ ఎక్కువ కాలంపాటు సినిమాలకు విరామం ఇవ్వాల్సి వస్తుందని మహేశ్ ఆ ఆలోచనను విరమించుకున్నట్టు తెలిసింది.
ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న మహేశ్ సర్జరీ చేయించుకుంటే మంచిదని భావించారు మహేష్. ఈ క్రమంలో కుటుంబంతో కలిసి న్యూయార్క్కు వెళ్లిన మహేశ్ ఓ పక్క హాలీడే ప్లాన్ చేస్తూనే మరో పక్క శస్త్రచికిత్స చేయించుకునేందుకు సిద్ధమయ్యాడని కొన్ని గాసిపస్ వినిపిస్తున్నాయి. మరి ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ నెలాఖరులోగా ఆయన శస్త్ర చికిత్సను చేయించుకోడానికి సిద్ధమయ్యారని సమాచారం. ఒకవేళ ఈ వార్త కనుక వాస్తవమయితే మహేష్ కనీసం మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవలసిందే. దీంతో మన సూపర్స్టార్ తాత్కాలికంగా సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చినట్లే అని చెప్పుకోవచ్చు. అయితే మహేశ్ తన శస్త్రచికిత్సను అమెరికాలో చేయించుకుంటాడా, లేక హైదరాబాద్లో చేయించుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక మహేశ్ భార్య నమ్రత శిరోద్కర్ తన సోషల్ మీడియా ద్వారా మహేశ్ తన సినిమాలకు కాస్త బ్రేక్ని ఇవ్వనున్నట్లు తెలిపింది.