రాజా హీరోగా ఆనంద్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని చిన్న చిన్న సినిమాల్లో హీరోగా చేసినప్పటికీ ఆశించినంత గుర్తింపు అయితే తెచ్చుకోలేకపోయాడు రాజా. తర్వాత కొన్ని సైడ్ క్యారెక్టర్స్ లో నటించి మెప్పించాడు. ఆ తర్వాత చాలా మంచి పోటీకి వచ్చేసి కొత్త కొత్త హీరోలందరూ రావడంతో రాజాకు నిధానంగా అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి. దీంతో సినిమాలను వదిలిపెట్టి ఓ క్రీస్టియన్ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన పూర్తిగా దేవుని సేవకు అంకితమవ్వాలని వాక్యాన్ని భోధిస్తూ.. అంతర్జాతీయ సువార్తీకుడిగా మారారు. తాజాగా ఈయన పవన్ కళ్యాణ్ ఫై ఘాటైన వాక్యాలు చేసి విమర్శల పాలవుతున్నారు.
‘ఎవరు నువ్వు.. నువ్వేమైనా ‘మెస్సయ్య’ (దైవదూత-జీసన్ను మెస్సయ్యగా పిలుస్తారు)అనుకుంటున్నావా? లోకరక్షకుడివా నువ్వు. అంటూ ఎందుకయ్యా నీకు అంత అహంకారం. ప్రజల మధ్యలోకి వెళ్లి కనీసం వారం రోజుల పాదయాత్ర చేయయ్యా.. పవన్ కళ్యాణ్ కనీసం అప్పుడైనా వాళ్ల బాధ నీకు తెలుస్తోంది. అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రజల మధ్యకు వెళ్లి వాళ్ల ఆవేదనను తెలుసుకుని అప్పుడు మాట్లాడండి’ అంటూ ఫైర్ అయ్యారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని చూసిన అభిమానులు, అలాగే జనసేన కార్య కర్తలు నీకు అవసరమా బ్రదర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక ఇదిలా ఉంటే ఒకరకంగా చెప్పాలంటే రాజాకు అవసరం లేని టాపిక్ ఇది. మరి ఆయనకు ఏం సంబంధం ఉందని పవన్ను టార్గెట్ చేసి కామెంట్లు చేస్తున్నారో అర్ధం కావడం లేదంటూ ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కొంత మంచి మీకెందుకు అంటూ చాలా సున్నితంగా సమాధానమిస్తుంటే.. మరి కొందరు ఇంకాస్త ముందుకెళ్లి తిట్ల వర్షం కూడా కురిపిస్తున్నారు. మరి ఇదిలా ఉంటే... ఒకప్పుడు ఎంతో మంచి చిత్రాల్లో నటించి హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రాజా ఇప్పుడెందుకు ఇలాంటి వివాదాల్లో తల దూరుస్తున్నాడంటూ కొంత మంది ఫీలవుతున్నారు.