పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇప్పటికే తన తదుపరి సినిమా అయిన పింక్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ ఇటీవల బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కి మంచి విజయాన్నిఆ అందుకుంది. కోర్ట్ డ్రామా నేపథ్యంలో కొద్దిపాటి యాక్షన్ తో నడిచే ఈ సినిమాని తెలుగు నేటివిటీకి తగ్గట్లు కొద్దిపాటి మార్పులు చేసినట్లు సమాచారం. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. 

 

ఇకపోతే దీని తరువాత పవన్ నటించబోయే తదుపరి సినిమా కథ కూడా ఆల్మోస్ట్ సిద్ధం అయింది. కంచె, కృష్ణం వందే జగద్గురుమ్, వేదం, గమ్యం సినిమాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమాని రేపు అధికారిక పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఒక పీరియాడికల్ డ్రామా స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంటుందట. తమిళ నిర్మాత అయిన ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించబోయే హీరోయిన్ కోసం ఇటీవల వెతుకులాడిన దర్శకుడు క్రిష్, 

 

ఎట్టకేలకు గతంలో తాను వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కించిన కంచె సినిమాలో నటించిన ప్రగ్య జైస్వాల్ నే ఈ సినిమాలో పవన్ సరసన నటింపచేయడానికి ఎంపిక చేసినట్లు సమాచారం. గత కొద్దికాలంగా సరైన అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ప్రగ్యకు ఇది ఒక అద్భుతమైన ఆఫర్ అని, ఇక ఈ సినిమాలో తనను ఎంపిక చేసిన దర్శకుడు క్రిష్ కి, హీరో పవన్ కళ్యాణ్ కు ఎంతో రుణపడి ఉంటానని, అలానే సినిమాలో తన క్యారెక్టర్ ఎంతో బాగుంటుందని, తప్పకుండా ఆ పాత్రకు న్యాయం చేస్తానని అభిప్రాయపడుతోందట ప్రగ్య. అయితే ఆమె ఎంపిక పై సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది....!!
 

మరింత సమాచారం తెలుసుకోండి: