ప్రభాస్ బాహుబలి ఫ్రాంచైజీతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ ని సంపాదించుకున్నారు. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజి తర్వాత అంత స్టార్ డం ని సంపాదించుకున్నాడు ప్రభాస్. దాంతో సాహో' సినిమాని భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ లో వంశీ, ప్రమోద్ కలిసి నిర్మించిన విషయం తెల్సిందే. సాహోకు భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి. అయినా కూడా సినిమా బడ్జెట్ భారీగా పెట్టడం వల్ల నిర్మాతల తో పాటు బయ్యర్లకు నష్టాలు తప్పలేదు. అందుకే సాహో సినిమాతో వచ్చిన అనుభవంతో ప్రభాస్ ప్రస్తుత సినిమా జాన్ బడ్జెట్ విషయంలో యూవీ క్రియేషన్స్ నిర్మాతలు బాగా జాగ్రత్త పడుతున్నట్లుగా ప్రచారం జరిగింది.

 

అయితే అందులో వాస్తవం లేదని తెలుస్తోంది. తాజాగా జాన్ బడ్జెట్ విషయంలో యూవీ క్రియేషన్స్ నిర్మాతలు చాలా నమ్మకంగా ఉన్నట్లుగా ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చెప్పుకుంటున్నారు. ఇప్పటికే భారీ బడ్జెట్ ను ఈ సినిమా కోసం పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. ఐనా కూడా ఇంకా బడ్జెట్ ఎంతైనా పెట్టడానికి సిద్దంగా ఉనంట్టు, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తామని అంటున్నారట. సినిమాపై అంచనాలు భారీగా ఉన్న కారణంగా ఏమాత్రం బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా నిర్మిస్తున్నట్లుగా సమాచారం. సాహోలా కాకుండా ఈసారి పూర్తి స్థాయిలో ప్రేక్షకులకు, ప్రభాస్ ఫ్యాన్స్ కి అన్ని విధాలా సంతృప్తి కలిగేలా జాన్ సినిమా ఉంటుందంటూ నిర్మాతలు ధీమాగా చెబుతున్నారట.

 

ఇక మేకింగ్ లో స్టైలిష్ దర్శకుడిగా పేరున్న రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ప్రభాస్ కు జోడీగా ఈ భారీ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడిక్ బ్యాగ్డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా కథ ఎక్కువగా 1980 నేపథ్యంలో అది కూడా ఇటలీలో ఉంటుందని మేకర్స్ ముందునుంచి అంటున్నారు. ఇక రిలీజ్ డేట్ కూడా త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని లేటెస్ట్ న్యూస్. ఇక జాన్ సినిమా నుండి తాజాగా విడుదలైన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ లుక్ యమా క్లాసీగా ఉండటంతో ఫ్యాన్స్ కి మంచి ఊపొచ్చింది. ఈ సారి డార్లింగ్ పక్కా హిట్ కొట్టబోతున్నాడని ఇప్పటి నుంచే చెప్పుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: