టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముదుకు వచ్చి మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. నిజానికి తొలిరోజున ఈ సినిమాకు యావరేజ్ టాక్ మాత్రమే లభించింది. అయితే మహేష్ బాబు చాలా రోజుల తరువాత తన పంథాను మార్చి తనలోని కామెడీ యాంగిల్ ని బయటకు తీసి చేసిన అద్భుతమైన యాక్టింగ్ కి ఆయన ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు సైతం సినిమా చూడడానికి థియేటర్స్ కు క్యూ కట్టారు. ఇక ఇప్పటికే మంచి లాభాల బాట పట్టిన ఈ సినిమా, ప్రస్తుతం పర్వాలేదనిపించేలా ముందుకు సాగుతోంది. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయ శాంతి, 13 ఏళ్ళ గ్యాప్ తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. 

 

ఇకపోతే ఈ సినిమాలో కామెడీ డైలాగ్స్, ఫైట్స్, యాక్షన్ సీన్స్ ఎంతగా అదిరిపోయాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా సినిమాలోని నల్లమల ఫారెస్ట్ సీన్ సమయంలో వచ్చే రమణ లోడెత్తాలిరా అనే సీన్ సమయంలో జరిగే ఫైట్ తో పాటు, ఆ డైలాగ్ చెప్పే నటుడు కుమనన్ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకున్నారనే చెప్పాలి. ఇక ఆ సీన్ లో ముసలి వ్యక్తిగా నటించిన కుమనన్, గతంలో పలు తెలుగు సినిమాల్లో అక్కడక్కడా చిన్న చిన్న పాత్రల్లో నటించడం జరిగింది. ఇక ఈ సినిమాలో తనకు అవకాశం వచ్చిందని తెలియడంతో తన ఆనందానికి హద్దుల్లేవని, ఇక అది కూడా హీరో మహేష్ గారితో ఒక ఫైట్ కోసం అని తెలియగానే మరింత ఆనందముతో పాటు లోలోపల భయం కూడా వేసిందని అన్నారు. 

 

అయితే ఆ సీన్ షూటింగ్ కోసం దాదాపుగా ఆరు రోజులు పని చేసానని, కాగా షూటింగ్ మధ్యలో ఒకరోజు రిస్కీ షాట్ ఒకటి తీస్తున్న సమయంలో ఒక్కసారిగా తన కాలుకు దెబ్బ తగిలిందని, వెంటనే అప్రమత్తం అయిన హీరో మహేష్ గారు, తన పర్సనల్ డాక్టర్ ని పిలిపించి దగ్గరుండి మరీ దాదాపుగా నలభైవేల రూపాయలు  ఖర్చు పెట్టి కాస్ట్లీ ట్రీట్మెంట్ ఇప్పించారని అన్నారు. ఆయన అంత గొప్ప సూపర్ స్టార్ ఎందుకయ్యారో తనకు అప్పుడు అర్ధం అయిందని ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ చెప్పారు కుమనన్.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: