టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా గత ఏడాది వచ్చిన సాహో సినిమా, ప్రేక్షకుల అంచనాలు అయితే పూర్తిగా అందుకోలేక, ఓవరాల్ గా పర్వాలేదనిపించే సినిమాగా మిగిలిపోయింది. యువ దర్శకుడు సుజీత్ ఆ సినిమాను ఎంతో గ్రాండ్ లెవెల్లో అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కించగా, యువి క్రియేషన్స్ సంస్థ వంశీ, ప్రమోద్ ఆ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమా తరువాత ప్రస్తుతం ప్రభాస్, జాన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన గోల్డెన్ లెగ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా గతంలో గోపీచంద్ తో జిల్ అనే యాక్షన్ మూవీని తీసిన రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 

 

కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన రిట్రో ప్రేమకథగా ఎంతో భారీ లెవెల్లో తెరక్కేకుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు తల్లిగా అలనాటి బాలీవుడ్ నటి భాగ్యశ్రీ నటిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇకపోతే ఇటీవల హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైన ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్, నేటితో ముగిసినట్లు తెలుస్తోంది. ఇక మొన్న జనవరి 20వ తేదీన రెబల్ స్టార్ కృష్ణంరాజు తన 80వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ, ప్రస్తుతం తెరకెక్కుతున్న జాన్ సినిమాతో ప్రభాస్ రేంజ్ మరింతగా పెరగడం ఖాయం అని, ఇక ఈ సినిమాలో తాను కూడా ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చిన కృషంరాజు, సినిమాని వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. 

 

ఇకపోతే పుట్టినరోజు సందర్భంగా ఇటీవల కొందరు రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా ఎంతో గ్రాండ్ లెవెల్లో విందు ఇచ్చారు కృష్ణంరాజు. ఇక ఈ వేడుకకు ప్రభాస్ కూడా హాజరయ్యారు. అయితే ఆ వేడుకకు సంబందించిన ఫోటోలు నేడు కొన్ని మీడియా మాధ్యమాల ద్వారా బయటకు వచ్చాయి. కాగా ఆ ఫొటోల్లో ప్రభాస్ లేటెస్ట్ క్యాజువల్ వేర్ డ్రెస్ లో ఎంతో స్టైలిష్ గా కనపడుతున్నారు. ఇక ఈ ఫోటోలు బయటకు రావడంతో రెబల్ ఫ్యాన్స్ వాటిని విపరీతంగా లైక్స్, షేర్స్ తో సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ చేస్తున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: