పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ ముఖానికి రంగేసుకుంటాడని తెలిసి పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా సంతోషపడ్డారు. పవన్ సినిమా హిట్టు కొడితే ఆ బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. అజ్ఞాతవాసి తర్వాత పవన్ సినిమాలకు గ్యాప్ ఇచ్చి పొలిటికల్ గా బిజీగా మారాడు. అయితే కొద్దిపాటి గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాలు చేసేందుకు సై అన్నాడు. ప్రస్తుతం పింక్ రీమేక్ లో పవన్ నటిస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాను వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. 

 

రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 40 రోజులు డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో నివేదా థామస్ నటిస్తుందని తెలుస్తుంది. పవన్ సినిమా అనగానే అంతకుముందు సెట్స్ మీద ఉండగానే బిజినెస్ జరిగేది.. కాని పింక్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా బిజినెస్ విషయంలో అంత యాక్టివ్ బిజినెస్ జరగట్లేదని టాక్. నిర్మాత దిల్ రాజు కాబట్టి బిజినెస్ విషయంలో ఢోకా లేదు.

 

అయితే అనుకున్న దాని కన్నా తక్కువ రేటుకే ఈ సినిమాను అడుగుతున్నారట. అంతేకాదు ఆల్రెడీ రీమేక్స్ సబ్జెక్ట్ కాబట్టి డిజిటల్, శాటిలైట్ కేవలం తెలుగు వర్షన్ కు మాత్రమే ఉంటాయి. ఆ విధంగా కూడా నిర్మాతకు లాస్ అనే అంటున్నారు. బాలీవుడ్ లో అమితాబ్ చేసిన ఈ సినిమాను తమిళంలో అజిత్ హీరోగా నటించారు. తెలుగులో పవన్ లీడ్ రోల్ చేస్తూ పింక్ రీమేక్ వస్తుంది. ఈ సినిమాకు తెలుగులో లాయర్ సాబ్ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట. సినిమాకు సంబందించిన మరిన్ని డీటైల్స్ త్వరలో బయటకు వస్తాయి. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాన్ క్రిష్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: