బుల్లితెర నటులు సినిమాల్లో నటించడం సాధారణమైన విషయమే. ఎందుకంటే మొదట బుల్లితెరపై తమ నటన ప్రతిభను నిరూపించుకుని, తర్వాత వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుని సక్సెస్ అయిన వారున్నారు. కొందరు వెనకబడిన వారు ఉన్నారు. ఇక బుల్లితెరపై సంచలనాన్ని సృష్టించిన జబర్దస్త్ కామేడి షో గురించి అందరికి తెలిసిందే. ఈ షోలో నటించిన వారంత జీవితంలో మంచిస్దాయిలో స్దిరపడటమే కాకుండా, సినిమా రంగంలో కూడా అవకాశాలను అంది పుచ్చుకుంటున్నారు. అందులో సుడిగాలి సుధీర్ టీం నూ కూడ పేర్కొనవచ్చూ.
ఎన్నో అష్టకష్టాలు పడి ఈ రోజు వారు చేరుకున్న స్దాయిని గురించి ఎన్నో సందర్భాల్లో వివరించారు కూడా. ఇకపోతే ఈ జబర్దస్త్ కమెడియన్స్ సుడిగాలి సుధీర్, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ హీరోలుగా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ మూవీ ‘త్రీ మంకీస్’ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం. రిపబ్లిక్ డే కానుకగా ఈ మూవీ ట్రైలర్ను ఆదివారం నాడు బ్రహ్మానందం చేతుల మీదిగా విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఇక ఈ చిత్రంలో ఫణిగా గెటప్ శీను, ఆనంద్గా రాంప్రసాద్, సంతోష్గా సుడిగాలి సుధీర్ నటించారు. కాగా రెండు నిమిషాలు నిడివితో ఉన్న ఈ ట్రైలర్లో ఫన్ అండ్ రొమాన్స్తో పాటు ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చాడు దర్శకుడు అనిల్ కుమార్ జి... ఇక ఈ ఈ ట్రైలర్లో మొదలవ్వడంతోనే ‘ఈ ప్రపంచంలో మనం ఎప్పుడు ఎక్కడ ఎందుకు కలుస్తామో తెలియదు.. ఆ పైవాడికి తప్ప. మనం ఎంచుకున్న బాట.. ఆ విధి ఆడించే ఆట’ అనే వాయిస్ ఓవర్తో ఫణి,ఆనంద్, సంతోష్ అనే ముగ్గురు యువకుల బాల్యంతో మొదలుపెట్టారు.
ఇదే కాకుండా ఇందులో మాటలేనా మ్యాటర్ ఏమైనా ఉందా?? రా రాజా ఆడుకుందాం.. అంటూ కారుణ్య చౌదరి హాట్ అందాలతో కవ్వించమే కాకుండా త్రీ మంకీస్ని భయపెట్టి థ్రిల్లర్ని చూపిస్తోంది. పాపం సుడిగాలి సుధీర్ అందులో వీక్ అంటూ షకలక శంకర్ ఏదో కొత్త వ్యాధిపేరు చెప్తున్నారు అదేంటో తాజా ట్రైలర్లో మీరు చూడిండి. ఇకపోతే ఈ చిత్రాన్ని ఓరుగల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ జి.దర్శకత్వంలో నగేష్ జి. నిర్మించారు.