సరిలేరు నీకెవ్వరు’ రికార్డుఅల విషయంలో వెనకబడినా అనీల్ రావిపూడి కి వరసగా 5వ విజయం ఇచ్చిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. దీనితో రాజమౌళి కొరటాల శివల తరువాత వరస హిట్స్ అందుకుంటున్న దర్శకుల జాబితాలో అనీల్ చేరిపోయాడు. 

ప్రస్తుతం అనీల్ ఇదే జోష్ ను కొనసాగిస్తూ వీలైనంత త్వరలో ‘ఎఫ్ 3’ ని మొదలుపెట్టి వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదలచేయాలి అన్న ఉద్దేశ్యంతో ఈ మూవీ ప్రాజెక్ట్ గురించి అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సీక్వెల్ లో రవితేజా కళ్యాణ్ రామ్ లను జత చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయాలను తెలుసుకున్న దిల్ రాజ్ మాత్రం అనీల్ రావిపూడి ఆలోచనలతో విభేదిస్తూ ప్రస్తుతం ఏ మాత్రం మార్కెట్ లేని రవితేజా కళ్యాణ్ రామ్ లు వద్దని మరో క్రేజీ కాంబినేషన్ సెట్ చేద్దామని కుదిరితే తిరిగి వెంకీ వరుణ్ తేజ్ లని రిపీట్ చేద్దామని సలహాలు ఇస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ మూవీకి సంబంధించిన నటీ నటుల ఎంపికలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుని లీకులు ఇవ్వవద్దు అంటూ స్పష్టమైన సంకేతాలు దిల్ రాజ్ అనీల్ రావిపూడికి ఇచ్చినట్లు టాక్. 

తనకు తొలి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ కు అదేవిధంగా తొలి పెద్ద సినిమా చేసే అవకాశం ఇచ్చిన రవితేజా కు కృతజ్ఞతలు తెలియ చేసుకుందామని అనీల్ రావిపూడి ప్రయత్నిస్తున్నా ఆ ప్రయత్నాలు ముందుకు జరగడం లేదు అని తెలుస్తోంది. వాస్తవానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటి వరకు వచ్చిన సీక్వెల్స్ ఏమి విజయవంతం కాలేదు దీనికి ఒక్క ‘బాహుబలి’ మాత్రమే మినహాయింపు. అయితే ‘బాహుబలి’ కూడ సీక్వెల్ కాదు కేవలం పార్ట్ 2 మాత్రమే దీనితో అనీల్ రావిపూడి ఈ సెంటిమెంట్ ను కూడ బ్రేక్ చేయగలుగుతాడా లేదా అన్నది చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: