టాలీవుడ్ లో పదేళ్ల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి మాస్ దర్శకులు వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ రైతు కష్టాలపై ఓ యువకుడు చేసే పోరాటం.. మరోవైపు మాస్ ఎంట్ర టైన్ మెంట్ కోసం మరో పాత్రలో కనిపించారు చిరంజీవి. మొత్తానికి అన్ని ఎలిమెంట్స్ ఈ మూవీ సూపర్ హిట్ కి కారణం అయ్యింది. దాంతో చిరు ఎనర్జీకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక మెగా మానియా మొదలైంది అని అనుకున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ మూవీతో మరో సారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరంజీవి. దేశ చరిత్రలో కనుమరుగైన పోరాట యోధులు ఎంతొో మంది ఉన్నారు.
అలాంటి వారిలో తెలుగు తొలి పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ తెరకెక్కించారు. స్వాతంత్ర పోరాటం నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకాదరణ లభించలేదు. తెలుగు, కన్నడ, మళియాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయ్యింది. ఖైదీ నెంబర్ 150 మూవీ లో చిరంజీవి సరసన అనుష్క నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ మూవీ కాజల్ నటించింది. ఆ తర్వాత సైరాలో మరో ఛాన్స్ వచ్చిందని అన్నారు. కానీ ఆ మూవీలో తమన్నా, నయనతార తో నటించారు. ప్రస్తుతం కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కతుంది. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టెయిన్మెంట్స్ సంస్థతో కలిసి రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ మూవీలో చిరంజీవి సరసన అనుష్క నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ విషయం గాసిప్ మాత్రమే అయినా.. ఈ వార్త సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే మూవీపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఈ వార్త సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తోంది. సైరాలో అనుష్క పాత్రను సినిమా రిలీజ్ అయ్యాకే ప్రేక్షకులు తెలుసుకోగలిగారు. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ సినిమా యూనిట్ ఇవ్వాల్సి ఉంది.